Nellore: కళాశాల గదిలో అబార్షన్.. బీటెక్ విద్యార్థిని మృతి
నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని అబార్షన్ కారణంగా తరగతి గదిలోనే మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
నెల్లూరు (నేర విభాగం), న్యూస్టుడే: నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని అబార్షన్ కారణంగా తరగతి గదిలోనే మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. మర్రిపాడు మండలానికి చెందిన యువతి (19) నెల్లూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 11న కళాశాల విద్యార్థులందరూ ప్రాంగణంలో ఉండగా.. యువతి ఒక్కరే గదిలో ఉండి తలుపులకు గడియ పెట్టుకున్నారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి స్నేహితులు తలుపులు పగలగొట్టి చూడగా తరగతి గదిలోనే తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉండగా.. పక్కనే ఆరు నెలల పిండం ఉంది. తోటి విద్యార్థులు హుటాహుటిన తల్లిని, పిండాన్ని ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే తల్లి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నెల్లూరుగ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తరగతి గదిలోనే అబార్షన్ అయ్యిందా? లేదా వీడియో ద్వారా తనకు తానే అబార్షన్ చేసుకుందా? అనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. యువతి సెల్ఫోను ఆధారంగా అనంతసాగరానికి చెందిన కారు డ్రైవరుతో పరిచయాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారిస్తున్నట్లు నెల్లూరు గ్రామీణ సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదక్ జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. -
జూబ్లీహిల్స్ పోలీసుల అదుపులో హరీశ్రావు మాజీ పీఏ
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిని చంపిన తండ్రి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు మద్యం మత్తులో ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేశాడు. -
వృద్ధురాలిపై చెప్పుతో దాడి
తాము చెప్పిన సంఖ్య కంటే ఎక్కువమంది మహిళలను ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చిందన్న కారణంతో ఓ వృద్ధురాలిపై వైకాపా కదిరి అభ్యర్థి మక్బూల్ అహమ్మద్ సమీప బంధువు పరికి షామీర్బాషా అసభ్య పదజాలంతో దూషిస్తూ చెప్పుతో దాడి చేశాడు. -
ఇసుకాసురుల కాసుల వేటలో.. మరో యువకుడు బలి
వైకాపా నాయకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఇసుక తవ్వకాలతో మరో యువకుడు మృతిచెందారు. -
అనిశాకు చిక్కిన ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్
లంచం తీసుకున్న కేసులో ఎంపీడీవో, సీనియర్ అసిస్టెంట్లను అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ నిజామాబాద్ జిల్లా డీఎస్పీ శేఖర్ తెలిపారు. -
గోవా జైల్లో ఉన్న డ్రగ్ డాన్ ఫైజల్ అరెస్టు
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో మరో ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. గోవా డ్రగ్స్ నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించే నైజీరియన్ ఇవాల ఉడోక స్టాన్లీకి సహచరుడు మహ్మద్ ఉస్మాన్ అలియాస్ ఫైజల్(29)ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. -
ఇఫ్తార్ ముగించి ఇంటికొస్తున్న బాలుడి కిడ్నాప్.. దారుణహత్య
మహారాష్ట్రలోని ఠాణె సమీప గోరేగావ్లో డబ్బు కోసం తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. -
మహిళ ఆత్మహత్య.. పక్కింట్లో మరో మహిళ హత్య!
ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది సమయానికే పక్కింటి మహిళ హత్యకు గురవడం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్లో కలకలం సృష్టించింది. -
భారీ రాబడులంటూ కోటికి పైగా కొట్టేశారు.. వెలుగులోకి ఫేక్ స్టాక్ మార్కెట్ స్కామ్!
Scam Alert: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో పెద్ద మొత్తంలో స్థిరమైన ఆదాయం అంటూ మోసగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడిన ఉదంతం ఇదీ..
తాజా వార్తలు (Latest News)
-
2030 నాటికి విమాన సర్వీసులు డబుల్..
-
ఉప్పల్లో సిక్సర్ల మోత.. ముంబయిని ఓడించి బోణీ కొట్టిన హైదరాబాద్
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన