పెట్రోల్ పోసి నిప్పంటించి.. రాయితో కొట్టి.. సొంత తమ్ముడిని దారుణంగా చంపిన సోదరుడు
కుటుంబ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన దారుణమిది. సొంత తమ్ముడిపైనే పెట్రోలు పోసి నిప్పంటించిన ఓ అన్న.. అతను ఇంట్లోంచి బయటికి రాకుండా తలుపు వద్ద బండ పెట్టాడు.
కరీమాబాద్ (వరంగల్), న్యూస్టుడే: కుటుంబ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన దారుణమిది. సొంత తమ్ముడిపైనే పెట్రోలు పోసి నిప్పంటించిన ఓ అన్న.. అతను ఇంట్లోంచి బయటికి రాకుండా తలుపు వద్ద బండ పెట్టాడు. ఎలాగోలా తప్పించుకుని బయటికి వస్తే వీధిలో అందరిముందే రాయితో కొట్టి కొట్టి చంపాడు. దాదాపు మూడు గంటల సేపు అతను తమ్ముడిని కొడుతూ ఉన్నా..ఎవరూ అడ్డుకోలేదు. కనీసం పోలీసులకు సమాచారం కూడా అందించలేదు. తన వాటాగా వచ్చిన స్థలాన్ని అమ్ముకోవడానికి తమ్ముడు ప్రయత్నించడం ఇష్టం లేని అన్నే ఇంతటి దారుణానికి తెగబడ్డాడు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఉర్సు ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది.
మృతుడి భార్య, పోలీసుల కథనం ప్రకారం.... 40వ డివిజన్ ఉర్సు తాళ్లమండువ ప్రాంతానికి చెందిన గోవిందుల శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ ముగ్గురు అన్నదమ్ములు. తల్లిదండ్రులకు చెందిన ఇంటి స్థలాన్ని ముగ్గురు 94.16 గజాల చొప్పున పంచుకున్నారు. పెద్దవాడైన శ్రీనివాస్ మరణించారు. చిన్నవాడైన శ్రీకాంత్కు వచ్చిన వాటా విషయంలో గొడవపడిన అన్న శ్రీధర్, ఆ భూమి నీకు ఇవ్వనని, ఇక్కడుంటే చంపుతానని తీవ్రంగా కొట్టాడు. దాంతో శ్రీకాంత్ వరంగల్ నుంచి ఇల్లు వదిలి, తల్లితో కలసి నిజామాబాద్కు వెళ్లి కూలి పనిచేసుకుంటూ ఉంటున్నాడు. 2019లో అక్కడి అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలతో తనకు చెందిన ఇంటి స్థలాన్ని విక్రయించి ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవాలనుకున్నాడు. అదే విషయంపై నిజామాబాద్ నుంచి ఉర్సుకు వచ్చి తన వాటా స్థలాన్ని విక్రయించడానికి యత్నించగా సోదరుడు శ్రీధర్ ఎప్పటిలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఈనెల 7న మిల్స్కాలనీ పోలీసు స్టేషన్లో సోదరుడిపై ఫిర్యాదు చేశాడు.
పోలీసులు శ్రీధర్ను స్టేషన్ పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వగా, తన సోదరుడు భూమి అమ్ముకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని పోలీసుల ముందు ఒప్పుకొన్నాడు. భూమిని అమ్మడానికి ఇబ్బందిలేదని నమ్మిన శ్రీకాంత్ భార్యతో కలసి వరంగల్కు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటూ.. స్థలాన్ని విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం ఎప్పటిలాగే ఇద్దరు కొనుగోలుదారులను వెంట తీసుకొని స్థలం వద్దకు వెళ్లగా, వెనక నుంచి వచ్చిన శ్రీధర్ తమ్ముడు శ్రీకాంత్ను కొట్టడంతో.. స్థలం చూసేందుకు వచ్చిన వారు పారిపోయారు. తర్వాత శ్రీకాంత్ను ఇంట్లోకి తీసుకెళ్లి గాయపరిచి అతనిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. తలుపు వద్ద బండరాయి అడ్డుగా పెట్టాడు. ఎలాగోలా శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తగా, బజార్లో అందరూ చూస్తుండగానే రాయితో కొట్టి హత్యచేసినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీకాంత్ను కొడుతున్నా.. స్థానికంగా ఉన్న వారెవ్వరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయారు. శ్రీధర్, అతని భార్యాపిల్లలు ఇల్లు వదిలి పారిపోయారు. సంఘటన స్థలానికి ఏసీపీ బోనాల కిషన్, మిల్స్కాలనీ సీఐ శ్రీనివాస్ చేరుకుని పోలీసు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు సీఐ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?