పండుటాకులపై పాశవిక దాడి: బూటుకాళ్లతో తన్నడంతో వృద్ధుడి మృతి..భార్యకు గాయాలు
పండుటాకుల్లా ఉన్న వృద్ధులను చూస్తేనే హృదయం ద్రవిస్తుంది. అలాంటి వారిపై కన్నూమిన్నూ తెలియని ఓ వ్యక్తి బూటు కాళ్లతో దాడి చేశాడు.
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్టుడే: పండుటాకుల్లా ఉన్న వృద్ధులను చూస్తేనే హృదయం ద్రవిస్తుంది. అలాంటి వారిపై కన్నూమిన్నూ తెలియని ఓ వ్యక్తి బూటు కాళ్లతో దాడి చేశాడు. గుండెపై తన్నడంతో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కూలీలైన్ ఏరియాలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... స్థానికులైన దొడ్డ పోచయ్య(75), లచ్చమ్మ దంపతులు కూరగాయల మార్కెట్లో పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.
సంతానం లేకపోవడంతో బంధువుల కుమారుడు చందర్ను పెంచుకున్నారు. గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్న చందర్(30) అవివాహితుడు. స్థానికుడైన హరిప్రసాద్ ఇంట్లో సిలిండర్ వేసే క్రమంలో వారింటి ఫోన్నంబరు తీసుకున్నాడు. ఈ క్రమంలో చందర్ తరచూ తన భార్యను వేధిస్తున్నాడని హరిప్రసాద్ ఆవేశానికి గురయ్యాడు. నెల రోజుల క్రితం అదే విషయాన్ని ప్రశ్నించడానికి చందర్ ఇంటికి వెళ్లాడు. అతను ఇంట్లో లేకపోవడంతో, తీరు మార్చుకోకుంటే అంతం చేస్తానంటూ హెచ్చరించాడు. చందర్ ఇటీవల తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు తెలుసుకున్న హరిప్రసాద్... ఆవేశంతో ఆదివారం తెల్లవారుజామున అక్కడికి వెళ్లాడు. చందర్ అక్కడ లేకపోవడంతో వృద్ధులను చితకబాదాడు. ఐటీసీˆలో కార్మికుడిగా పనిచేస్తున్న హరిప్రసాద్ తన విధుల్లో వినియోగించే బూట్లను ధరించి... వారిని విచక్షణా రహితంగా తన్నాడు. కొట్టొద్దని ఎంత ప్రాధేయపడినా వినిపించుకోకుండా పోచయ్య గుండెలపై ఎగిరి తన్నడంతో ఆయన అక్కడికక్కడే కన్నుమూశాడు. వృద్ధురాలి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వారి కుమారుడి ఆచూకీ తెలియరాలేదు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య