Chittoor: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. పక్కనే రక్తపు మడుగులో యువకుడు
చిత్తూరులో అనుమానాస్పద స్థితిలో మంగళవారం మధ్యాహ్నం ఓ యువతి మృతి చెందింది. పక్కనే రక్తపు మడుగులో ప్రాణాలతో యువకుడూ పడి ఉండటం సంచలనంగా మారింది.
ఈనాడు డిజిటల్, చిత్తూరు: చిత్తూరులో అనుమానాస్పద స్థితిలో మంగళవారం మధ్యాహ్నం ఓ యువతి మృతి చెందింది. పక్కనే రక్తపు మడుగులో ప్రాణాలతో యువకుడూ పడి ఉండటం సంచలనంగా మారింది. యువతిని అతనే హతమార్చి తానూ ఆత్మహత్యకు యత్నించాడా లేక ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేశారు. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని కొండమిట్టలో దుర్గా ప్రశాంతి (23) బ్యూటీషియన్గా పనిచేస్తున్నారు. యువతి తండ్రి నాగరాజు స్థానిక తాలుకా పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన చక్రవర్తి (31) అనే యువకుడు చిత్తూరులోని దర్గాకూడలిలో తల్లి ప్రమీల, స్నేహితుడు శశికుమార్తో కలిసి మూడు నెలలుగా దుకాణం నిర్వహిస్తున్నారు. ప్రశాంతి, చక్రవర్తికి దాదాపు రెండేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే చక్రవర్తి చిత్తూరుకు మకాం మార్చాడు. మంగళవారం మధ్యాహ్నం చక్రవర్తి.. బ్యూటీపార్లర్ వద్దకు వచ్చాడు. ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎటువంటి అలికిడి రాకపోవడంతో స్థానికులు గమనించి పార్లర్ లోపలకు వెళ్లగా యువతీ, యువకుడు రక్తపు మడుగులో కనిపించారు. యువతి మృతదేహంపై ఎటువంటి గాయాలు లేకపోవడం, చక్రవర్తి గొంతు, చేతులకు కత్తిగాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువకుడిని తొలుత జిల్లా ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి పంపించారు. యువతిని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా వైద్యశాలలో ఉంచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్