Kadapa: ఇన్సూరెన్స్ సొమ్ము కోసం మామనే చంపేశాడు!
బీమా సొమ్ము కోసం సొంత మామనే స్నేహితుడితో కలిసి అంతమొందించిన కేసులో ఇద్దరు నేరస్థులకు వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించినట్లు ఎర్రగుంట్ల సీఐ మంజునాథరెడ్డి తెలిపారు.
స్నేహితుడితో కలిసి హతమార్చి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
ఇద్దరు నేరస్థులకు జీవిత ఖైదు
ఎర్రగుంట్ల, న్యూస్టుడే: బీమా సొమ్ము కోసం సొంత మామనే స్నేహితుడితో కలిసి అంతమొందించిన కేసులో ఇద్దరు నేరస్థులకు వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించినట్లు ఎర్రగుంట్ల సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యరవల చెన్నకృష్ణారెడ్డి (59), లక్ష్మీప్రసన్న దంపతులు తమ పెద్దకూమర్తెను విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామానికి చెందిన రాయపాటి కిరణ్కుమార్రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్లకు కిరణ్కుమార్రెడ్డి తన మామ చెన్నకృష్ణారెడ్డికి కోటి రూపాయలకు జీవిత బీమా చేయించాడు. పత్రాల్లో నామినీగా తన పేరు నమోదు చేయించాడు. 2019 జనవరి 30న మల్లెం శ్రీనివాసులరెడ్డి అనే స్నేహితుడితో కలిసి మామను కారులో ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లాడు. దారిలో మిత్రుడితో కలిసి ఆయనను హతమార్చి ప్రొద్దుటూరు సమీపంలోని పోట్లదుర్తి వద్ద రోడ్డుపై విసిరేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అక్కడున్న స్థానికులు ఇది గుర్తించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రొద్దుటూరు న్యాయస్థానం న్యాయమూర్తి జీఎస్ రమేష్కుమార్ నేరస్థులకు జీవిత ఖైదు విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 11 లక్షల చొప్పున జరిమానా విధించారు. చెల్లించని పక్షంలో అదనంగా మరో ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పునిచ్చారని సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య