Husband - Wife: దీపమే.. శాపమై..!
అన్యోన్య దాంపత్యం..ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులు.. సుఖసంతోషాలతో సాగిపోతున్న వారి జీవితాన్ని విద్యుత్తు ప్రమాదం కబళించింది.
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతంతో భార్య మృతి
ఆమెను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన భర్త
ఒకరి తర్వాత ఒకరు క్షణాల్లోనే మృత్యుఒడికి
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఘటన
చెన్నూరు, న్యూస్టుడే: అన్యోన్య దాంపత్యం..ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇద్దరు కుమారులు.. సుఖసంతోషాలతో సాగిపోతున్న వారి జీవితాన్ని విద్యుత్తు ప్రమాదం కబళించింది. దంపతులిద్దర్నీ క్షణాల్లో మృత్యుఒడికి చేర్చింది. ఈ ప్రమాదానికి ఇంటి ఆవరణలో వెలుగుకోసం ఏర్పాటుచేసిన విద్యుద్దీపమే కారణం కావడం విషాదకరం.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం లైన్గడ్డ కాలనీలో చెన్నూరు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు బొల్లంపల్లి శ్రీనివాస్(44), ఆయన భార్య శశిదేవి అలియాస్ జయశ్రీ(38) నివాసం ఉంటున్నారు. వారికి ఇంటర్, పదో తరగతి చదువుతున్న చరణ్రాజ్, పవన్తేజ్ కుమారులున్నారు. ఉదయమే నిద్రలేచిన శశిదేవి ముందుగా గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులు, వర్షం కారణంగా ఇంటి ఆవరణలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు. తీగపై ఆరేసిన దుస్తులు గాలికి కిందపడి ఉండటాన్ని గుర్తించి, వాటిని మళ్లీ అదే తీగపై వేసే ప్రయత్నం చేశారు. ఆ తీగకు విద్యుత్తు సరఫరా జరగడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడే ఉన్న కారు వైపు వాలిపోయారు. ఆ అలికిడికి ఇంట్లోంచి పరుగున వచ్చిన భర్త ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతనికీ విద్యుత్తు ప్రసారమైంది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
చిన్న ఏమరుపాటుతో
ఇంటి ఆవరణలోకి వెలుగు వచ్చేందుకు వీలుగా ప్రధాన గేటు అమర్చిన గోడకు విద్యుద్దీపం ఏర్పాటుచేసి ఉంది. దీపం ఉన్న గొట్టానికి, ఇంకోవైపున్న కమ్మీకి మధ్య తీగ కట్టుకుని దుస్తులు ఆరేసుకునే ఏర్పాటు చేసుకున్నారా దంపతులు. రాత్రి కురిసిన వర్షానికి విద్యుద్దీపం ద్వారా గొట్టానికి, దాన్నుంచి తీగకు విద్యుత్తు ప్రసారమైంది. ఈ విషయం తెలియని ఆమె యథావిధిగా దుస్తులు ఆరేస్తూ తీగకు చెయ్యి తగిలి విద్యుదాఘాతానికి గురవగా, పడిపోయిన ఆమెను కాపాడాలనే తాపత్రయంలో భర్త ప్రమాదంలో పడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్