Karimnagar: ఇంటెలిజెన్స్ సీఐ వల్లే చనిపోతున్నా..!
‘నా టైమ్ బాగోలేదు.. నేనెవరికీ అన్యాయం చేయలేదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ సార్ వల్లే నేను చనిపోతున్నా.. సీఐ సారు కొన్న ప్లాట్ అమ్ముడుపోవట్లేదు.
పది పేజీల లేఖ రాసి వ్యక్తి ఆత్మహత్య
భూమి విక్రయం విషయంలో వేధించాడని ఆవేదన
‘నా టైమ్ బాగోలేదు.. నేనెవరికీ అన్యాయం చేయలేదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ సార్ వల్లే నేను చనిపోతున్నా.. సీఐ సారు కొన్న ప్లాట్ అమ్ముడుపోవట్లేదు. ఆయన విషయంలో భయమేస్తోంది. నేను కేవలం ప్లాట్ అమ్మి 10 లక్షల లాభం చూపిస్తానని చెప్పా. కానీ అమ్ముడు పోనిది 10 లక్షలు ఎలా తేవాలి. రోజూ బతికి చచ్చేకంటే.. ఒకేసారి చచ్చిపోదామనుకుంటున్నా. గోపీకృష్ణ సార్ వల్ల నా కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. కావాలంటే నా ఫోన్లో రికార్డులు చెక్ చేయండి. మొత్తం విషయం బాలాజీ సార్కు తెలుసు. సారీ.. సుజాతా.. నేను నీకు అన్యాయం చేస్తున్నా బిట్టు, కావ్యలను చూసుకో. ధైర్యంగా ఉండు. నాకు యముడిలాగా గోపీ సారు తగిలిండు.. నన్ను బతకనివ్వడు.. అందుకే చనిపోతున్న.’
ఆత్మహత్య లేఖలో శ్యామ్ రాసిన మాటలు
కరీంనగర్ - (ఈనాడు), చొప్పదండి (న్యూస్టుడే): తాను కొన్న భూమిని తిరిగి విక్రయించలేదంటూ.. పోలీసు అధికారి వేధించడంతో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వైనమిది. భూమిని విక్రయించాలని సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ గోపీకృష్ణ తనను పదేపదే బెదిరిస్తున్నారంటూ కరీంనగర్కు చెందిన బొడిగె శంబయ్య అలియాస్ శ్యామ్ (55) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. గోపీకృష్ణ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్యామ్ పది పేజీల లేఖ రాశారు. చొప్పదండి సీఐ రవీందర్, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో శ్యామ్ భూముల క్రయవిక్రయాల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటారు. కరీంనగర్లోని విద్యారణ్యపురిలో అద్దె ఇంట్లో భార్యతో కలిసి నివసిస్తున్నారు. వీరి కుమారుడు సంజయ్ (బిట్టు), కుమార్తె కావ్య హైదరాబాద్లో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు.
కరీంనగర్ బ్యాంకు కాలనీలో నివసిస్తున్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఐ కురికాల గోపీకృష్ణ భూపాలపట్నంలో 8 నెలల కిందట శ్యామ్ మధ్యవర్తిత్వంతో 20 గుంటల భూమిని రూ.50 లక్షలకు కొనుగోలు చేశారు. అయిదారు నెలల్లో రూ.10 లక్షలు లాభం వచ్చేలా విక్రయిస్తానని గోపీకృష్ణకు శ్యామ్ చెప్పారు. కానీ భూమిని విక్రయించలేకపోవడంతో సీఐ గోపీకృష్ణ ఒత్తిడి చేశారు. తనకు భూమిని అమ్మిపెట్టడంతోపాటు అదనంగా రూ.10 లక్షల లాభం ఇవ్వాల్సిందేనని సీఐ పట్టుబట్టడంతో శ్యామ్ రూ.3 లక్షలు అప్పు చేసి ఆయనకు చెల్లించారు. తన బావ పేరిట భూమి కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. భూమి విక్రయించడంతోపాటు జాప్యానికి రూ.10 లక్షలు అదనంగా చెల్లిస్తానని శ్యామ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గోపీకృష్ణకు ఒప్పంద పత్రాన్ని రాసిచ్చారు.
గురువారం గోపీకృష్ణ ఫోన్ చేసి తీవ్రంగా మాట్లాడడంతో కుంగిపోయిన శ్యామ్ శుక్రవారం మధ్యాహ్నం భూపాలపట్నం వెళ్తున్నానని బయలుదేరారు. అక్కడి సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన మృతదేహంపై భార్య, పిల్లలు పడి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. సీఐ గోపీకృష్ణను కఠినంగా శిక్షించాలని, ఆయన ఫోన్ వస్తే తన తండ్రి ఇంట్లో భయంతో వణికేవారని శ్యామ్ కుమారుడు బిట్టు విలపిస్తూ చెప్పాడు. గోపీకృష్ణపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, ఆయన పరారీలో ఉన్నాడని చొప్పదండి సీఐ రవీందర్ తెలిపారు.
నువ్వు సచ్చిపోతే సచ్చిపో.. నాకేమైతది.!
‘నువ్వు సచ్చిపోతే సచ్చిపో.. నాకేమైతది! నేను వచ్చి దండ వేసిపోత.. నేను ఇస్త పురుగుల మందు.. నీ భార్య పిల్లలే బిచ్చమెత్తుకుంటరు. నువ్వు పోతె నీ ఇల్లును జఫ్తు చేసుకుంట.’ అంటూ శ్యామ్తో గోపీకృష్ణ ఫోన్ సంభాషణలు పోలీసులకు లభించాయి. 30 నిమిషాల నిడివి ఉన్న మరో సంభాషణలో సీఐతో పాటు మరో మధ్యవర్తి బాలాజీ మాటలు కూడా వినిపించాయి. ‘పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్న సార్.. అమ్మకానికి పార్టీలు రావడం లేదు. కాల్మొక్త సారూ.. అమ్ముడు పోకపోతే చనిపోదామనుకుంటున్న’.. అని శ్యామ్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ‘చొప్పదండి సీఐ.. నా జూనియర్. నీ బొక్కలు ఇరగ్గొడ్తడు. సచ్చిపో ఏమైతది.. సచ్చినా మనశ్శాంతి లేకుండా చేస్తాను. కొంత టైం అయినా తీసుకుని అమ్మిపెట్టు’ అన్న సీఐ మాటలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ను కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరిరావు మృతిచెందారు. -
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి