Eluru: వేడి నూనె ఒంటిపై పోసి చిత్రహింసలు
ప్రియురాలి ఒంటిపై వేడి నూనె పోసి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడోయువకుడు. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
ఇంజినీరింగ్ విద్యార్థినిపై ప్రియుడి ఘాతుకం
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: ప్రియురాలి ఒంటిపై వేడి నూనె పోసి ఆమెను చిత్రహింసలకు గురి చేశాడోయువకుడు. ఈ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు..ఏలూరు శివారు ప్రాంతానికి చెందిన ఓ యువతి కాకినాడలోని ఓ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. నాలుగేళ్ల కిందట దుగ్గిరాల జోసఫ్నగర్కు చెందిన సదర్ల అనుదీప్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అనుదీప్ తల్లి ఏలూరులో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 9న అనుదీప్ కాకినాడలోని కళాశాల వద్దకు వెళ్లి.. పెళ్లి పేరుతో యువతిని దుగ్గిరాల తీసుకొచ్చి ఓ గదిలో ఉంచాడు. అదే రోజు రాత్రి శారీరకంగా కలవాలంటూ ఒత్తిడి చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో మరుసటి రోజు రాత్రి మద్యం తాగొచ్చి బలవంతం చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నూనె కాచి కాళ్లు, చేతుల మీద పోసి, అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజూ చిత్రహింసలకు గురిచేసే వాడు. అనంతరం గదికి తాళం వేసి ఏమీ తెలియనట్లుగా బయటకు వెళ్లేవాడు.
ఈ నెల 22వ తేదీ రాత్రి మద్యం తాగి వచ్చి యువతిని పీకనొక్కి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె అతడిని పక్కకు తోసి ఫోను లాక్కుని తండ్రికి సమాచారం ఇచ్చింది. ఆమె కుటుంబ సభ్యులు వెళ్లే సరికే అతను అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువతి తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె నెల రోజుల కిందట కాకినాడ వెళ్లిందని, రాత్రి ఫోన్ చేసేంతవరకు అక్కడే ఉందని అనుకుంటున్నామని చెప్పారు. అనుదీప్ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా అనుదీప్, బాధిత యువతి వివాహం చేసుకున్నట్లు ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ మూడేళ్లగా సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రీటౌను పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని పట్టుకుని చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
మంత్రి ఏం చేస్తున్నారు
సౌకర్యాలు కల్పించలేకపోతే ఆసుపత్రిని మూసేసుకోండి..?
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఆగ్రహం
ఏలూరు టూటౌన్, న్యూస్టుడే: ‘ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించకుండా ఆరోగ్యశాఖామంత్రి విడదల రజిని ఏం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రియుడి దాడిలో గాయపడి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్ విద్యార్థినిని ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిందితుడిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలోని బర్నింగ్ వార్డులో ఏసీలు పనిచేయకపోవడం, మిగిలిన గదుల్లో సౌకర్యాలు లేకపోవడాన్ని గమనించి ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ‘గత ప్రభుత్వ హయాంలో నిధులు పుష్కలంగా వచ్చేవి. ఇప్పుడు ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మీకు జీతాలు సక్రమంగా వస్తున్నాయి కదా.. రాకపోతే ఆ నొప్పి తెలిసేది. సౌకర్యాలు కల్పించలేకపోతే ఆసుపత్రి మూసేస్తున్నామంటూ బోర్డు పెట్టుకోండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చింతమనేని కలెక్టర్తో మాట్లాడగా 15 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!