Kakinada: 15 రోజుల్లో పెళ్లి.. కబళించిన రోడ్డు ప్రమాదం

మరో పదిహేను రోజుల్లో వివాహం చేసుకోనున్న జంట రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరుకు చెందిన మానేపల్లి రాజకుమార్‌(25), కిర్లంపూడి మండలం సోమవరానికి చెందిన మలిరెడ్డి దుర్గాభవాని(18)లకు మే 10న వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు.

Updated : 26 Apr 2023 07:01 IST

ఏపీలో యువజంట మృతి

రాజానగరం, న్యూస్‌టుడే: మరో పదిహేను రోజుల్లో వివాహం చేసుకోనున్న జంట రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరుకు చెందిన మానేపల్లి రాజకుమార్‌(25), కిర్లంపూడి మండలం సోమవరానికి చెందిన మలిరెడ్డి దుర్గాభవాని(18)లకు మే 10న వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. మంగళవారం వారిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని