Nellore: పట్టపగలే నడిరోడ్డుపై అత్యాచార యత్నం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం 15ఏళ్ల బాలికపై పట్టపగలే నడివీధిలో అత్యాచారయత్నం జరిగింది.

Updated : 29 Apr 2023 07:19 IST

సంగం, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం 15ఏళ్ల బాలికపై పట్టపగలే నడివీధిలో అత్యాచారయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలివి. బాధిత బాలిక దుకాణానికి వెళ్లి తిరిగొస్తుండగా యువకుడు  కె.రమేశ్‌ ద్విచక్రవాహనంతో అడ్డగించాడు. ఆ బాలిక శరీరంపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు బలవంతంగా తన వాహనంపైకి ఎక్కించుకునేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు తప్పించుకుని తన ఇంటికి పరుగు తీసింది. తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు నిందితుడిని నిలదీశారు. దీంతో వారిపైనా నిందితుడు దాడి చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని