వైఎస్ఆర్ జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి..
తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా... ఘాట్ రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడా కుమారుడు. వైయస్ఆర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమనుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కడప, నేరవార్తలు, న్యూస్టుడే: తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా... ఘాట్ రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడా కుమారుడు. వైయస్ఆర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమనుష ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ తెలిపారు. దువ్వూరు మండలం సింగనపల్లెకు చెందిన బొమ్ము చిన్నపుల్లారెడ్డి(62) కుమారుడు రాజశేఖర్రెడ్డి ఓ ప్రైవేటు పాఠశాల బస్సు క్లీనర్. చిన్నపుల్లారెడ్డి కొన్నేళ్లుగా క్షయతో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించిన తండ్రిని రాజశేఖర్రెడ్డి ఫిబ్రవరిలో కడప సమీపంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించి, ఇంటికి వెళ్లిపోయాడు. ఆసుపత్రి సిబ్బంది పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అదే నెల 23న రాజశేఖర్రెడ్డి ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య సిబ్బంది చిన్నపుల్లారెడ్డిని డిశ్ఛార్జి చేయగా... ఆసుపత్రి దగ్గరే ఆయన చనిపోయారు. తండ్రి మృతదేహానికి ఆసుపత్రికి చెందిన దుప్పటిని చుట్టిన రాజశేఖర్రెడ్డి... ఓ ఆటోను బాడుగకు మాట్లాడుకుని అందులోకి చేర్చాడు. మార్గంమధ్యలో గువ్వల చెరువు ఘాట్ రోడ్డులోకి తీసుకెళ్లి పొదల్లో పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో గత నెల 29న పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వారు గాలించి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. సంఘటన స్థలంలో ఉన్న దుప్పటిపై లోగోను పరిశీలించిన పోలీసులు... ఆసుపత్రికి వెళ్లి విచారించగా విషయం బయటపడింది. అంత్యక్రియలకు డబ్బుల్లేకనే మృతదేహాన్ని పడేసినట్లు నిందితుడు చెప్పాడు. తండ్రి మృతదేహాన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిన రాజశేఖర్రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!