Zaheerabad: చోరీ చేశాడని స్తంభానికి కట్టేసి కొట్టి చంపాడు..!

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ శివారులోని ఓ వెంచర్‌లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి కాలనీలో బాగారెడ్డిపల్లికి చెందిన మహేశ్‌(32) అనే వ్యక్తి ఒక్కడే నివసిస్తున్నారు.

Published : 06 May 2023 07:30 IST

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ శివారులోని ఓ వెంచర్‌లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి కాలనీలో బాగారెడ్డిపల్లికి చెందిన మహేశ్‌(32) అనే వ్యక్తి ఒక్కడే నివసిస్తున్నారు. ఆయన నివాసానికి దగ్గరలో ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. దాని యజమాని తన ఇనుప రాడ్లు దొంగిలించావంటూ మహేశ్‌ను నిలదీశాడు. అనంతరం అతన్ని లాక్కెళ్లి స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక మహేశ్‌ మృతిచెందాడు. యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి వరకు మృతుడి వైపు నుంచి ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో వివరాలు తెలియరాలేదని, శనివారం తదుపరి విచారణ చేసి కేసు నమోదు చేస్తామని రూరల్‌ ఎస్సై పరమేశ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని