Kerala: చికిత్స చేస్తున్న వైద్యురాలిని పొడిచి చంపేశాడు!
కేరళలోని కొల్లాం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన గాయానికి చికిత్స చేస్తున్న వైద్యురాలిని ఓ రోగి మద్యం మత్తులో కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు.
కేరళ ఆసుపత్రిలో దారుణానికి పాల్పడ్డ రోగి
కొల్లాం, తిరువనంతపురం: కేరళలోని కొల్లాం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన గాయానికి చికిత్స చేస్తున్న వైద్యురాలిని ఓ రోగి మద్యం మత్తులో కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. అడ్డుకోవడానికి యత్నించిన పోలీసులనూ గాయపర్చాడు. కొట్టరక్కరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నిందితుడు సందీప్ బుధవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. హెల్ప్లైన్ నంబరుకు ఫోన్ చేసి తనను కాపాడాలని అభ్యర్థించాడు. పోలీసులు అతడి ఇంటికి వెళ్లేసరికి కాలికి గాయంతో కనిపించాడు. చికిత్స కోసం వారు అతణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న అతడు బీభత్సం సృష్టించాడు. పోలీసులు అతణ్ని బలవంతంగా వందనా దాస్ అనే వైద్యురాలు(23) ఉన్న గదికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వారు బయట వేచి ఉండగా ఒక్కసారిగా వందన బిగ్గరగా కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారు. ఆమె వెంటే నిందితుడు కత్తెర, కత్తి పట్టుకుని వచ్చి చంపేస్తానంటూ కేకలు వేస్తూ దాడికి దిగాడు.
వందనను కత్తితో పలుమార్లు పొడిచాడు. అడ్డుకోబోయిన పోలీసులనూ గాయపర్చాడు. చివరకు పోలీసులు నిందితుణ్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వందనను తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు అనూహ్యంగా ఎందుకు దాడికి దిగాడో తెలియడం లేదని పోలీసులు తెలిపారు. అతడు మద్యానికి బానిసై తరచూ గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు. వైద్యురాలి హత్యపై కేరళ హైకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన వ్యవస్థ వైఫల్యమేనని పేర్కొంది. వైద్యురాలిని రక్షించడంలో పోలీసులు విఫమయ్యారని, అలాంటప్పుడు వారి అవసరం ఏముందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై వారంలోపు నివేదిక సమర్పించాలని కేరళ మానవ హక్కుల కమిషన్ పోలీసులను ఆదేశించింది. సందీప్ను రాష్ట్రప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత