East Godavari: ప్రేమించిన వ్యక్తి దక్కలేదని.. అర్ధరాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లి మరీ నరికేసింది!
ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదనే అక్కసుతో ఓ యువతి... అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి మరీ కత్తిపీటతో దాడిచేసి ప్రాణాలు తీసింది.
యువకుడిని చంపిన ప్రియురాలు
గోకవరం, న్యూస్టుడే: ప్రేమించిన వ్యక్తి తనకు దక్కలేదనే అక్కసుతో ఓ యువతి... అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి మరీ కత్తిపీటతో దాడిచేసి ప్రాణాలు తీసింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలేనికి చెందిన ఒమ్మి నాగశేషు(25) తాపీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెలకవీధికి చెందిన కుర్లు డిబేరా అనే యువతితో రాజమహేంద్రవరంలో చదువుకునే రోజుల నుంచి పరిచయం ఉంది. ఆరేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.
ఈ క్రమంలో నాగశేషు అవసరాల కోసం డిబేరా రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు ఇచ్చింది. వీరి ప్రేమ వ్యవహారం నాగశేషు కుటుంబసభ్యులకు తెలిసింది. ఆయనకు మరో యువతితో ఏడాది కిందట వివాహం జరిపించారు. ఈ పెళ్లి గురించి ఇటీవల డిబేరాకు తెలిసి నిలదీసింది. తనకు రావాల్సిన డబ్బు, గొలుసును ఇవ్వాలని పలుమార్లు కోరింది. ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకుంది. నాగశేషును చంపాలని నిర్ణయించుకున్న డిబేరా తన స్నేహితుడైన శివన్నారాయణ సాయం కోరింది. బైకుపై అతనితో కలిసి బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు నాగశేషు ఇంటికి వెళ్లింది. డాబాపై నిద్రిస్తున్న అతడిని గట్టిగా నిలదీయడంతో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కత్తిపీటతో డిబేరా దాడిచేసింది. అడ్డుకోబోయిన నాగశేషు తల్లి గంగపై... శివన్నారాయణ కర్రతో దాడికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని స్థానికులు... 108 వాహనంలో గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. గంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?