Warangal - junior panchayat secretary: జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
కుటుంబం కలహాలు, ఉద్యోగ భద్రత లేమితో మనస్తాపం చెందిన ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రభుత్వం న్యాయం చేయాలని జేపీఎస్ల ఆందోళన
ఖానాపురం, న్యూస్టుడే: కుటుంబం కలహాలు, ఉద్యోగ భద్రత లేమితో మనస్తాపం చెందిన ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. నర్సంపేట మండల కేంద్రానికి చెందిన బైరి సోని(29)కి తొమ్మిదేళ్ల క్రితం వరంగల్లోని రంగసాయిపేటకు చెందిన ప్రసాద్తో వివాహమైంది. ఖానాపురం మండలం రంగాపురంలో నాలుగేళ్ల నుంచి జేపీఎస్గా విధులు నిర్వహిస్తున్నారు. సర్వీసు క్రమబద్ధీకరించాలంటూ జేపీఎస్లు ఇటీవల చేపట్టిన ఆందోళనల్లోనూ చురుగ్గా పాల్గొన్న ఆమె.. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 6న విధుల్లో చేరారు. ఇదిలా ఉండగా.. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఆర్థిక సంబంధ గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులకు తోడు ఉద్యోగ భద్రతపై ఆందోళన ఆమెను కుంగదీశాయి.
శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన సోని మార్గమధ్యలో పురుగుమందు తాగారు. అక్కడి నుంచి నేరుగా రంగాపురం గ్రామపంచాయతీకి వెళ్లి సహచర కార్యదర్శులకు ఫోన్ ద్వారా విషయం చెప్పారు. వెంటనే అక్కడి సిబ్బంది నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉద్యోగ భద్రత లేదనే భయం, కుటుంబ ఇబ్బందుల వల్లనే సోని ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ జేపీఎస్లు నర్సంపేట మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. సోని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అంబులెన్స్ను అడ్డుకుని నిరసన తెలిపారు. వారిని తొలగించే క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి సోని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో శ్రీనివాసులు, డీసీపీ కరుణాకర్, డీపీవో కల్పన శుక్రవారం రాత్రి ఆందోళనకారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్స్టేషనుకు తరలించారు. సోని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని నర్సంపేట ఏసీపీ సంపత్కుమార్ తెలిపారు. ప్రసాద్, సోని దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది.
సోని మృతికి ప్రభుత్వమే కారణం
బండి సంజయ్
ఈనాడు, హైదరాబాద్: సోని ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోని ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శనివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భాజపా శ్రేణులకు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం