మంత్రి సబిత వ్యక్తిగత సిబ్బంది పేరిట మోసం.. కాంట్రాక్టు ఇప్పిస్తామని భారీగా స్వాహా
సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద పాఠశాలకు విద్యార్థులకు సంబంధించిన పలు ఉత్పత్తుల సరఫరా వ్యవహారంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యక్తిగత సిబ్బందిమంటూ మోసానికి పాల్పడిన ఏడుగురిపై బంజారాహిల్స్ పోలీసు ఠాణాలో కేసు నమోదైంది.
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద పాఠశాలకు విద్యార్థులకు సంబంధించిన పలు ఉత్పత్తుల సరఫరా వ్యవహారంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యక్తిగత సిబ్బందిమంటూ మోసానికి పాల్పడిన ఏడుగురిపై బంజారాహిల్స్ పోలీసు ఠాణాలో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సమగ్ర శిక్షా అభియాన్ కింద స్కూల్ షూస్ (బూట్లు), బ్యాగులు, సాక్సులు (మేజోళ్లు) సరఫరా చేసేందుకు హరియాణా రాష్ట్రం కర్నాల్లోని ఆల్ఫా ఇంటర్నేషనల్ సిటీకి చెందిన లిబర్టీ షూస్ సంస్థ ప్రతినిధులు మంత్రికి దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం జీకే కుమార్, బెల్లి తేజ, ఆంజనేయులు, రమేష్రెడ్డి అనే వ్యక్తులు లిబర్టీ షూస్ నిర్వాహకులను సంప్రదించారు. జీకే కుమార్ మంత్రి వ్యక్తిగత సహాయకుడిగా, తేజ రెండో వ్యక్తిగత సహాయకుడిగా, ఆంజనేయులు రాజకీయ కార్యదర్శిగా, రమేష్రెడ్డి పీఆర్వోగా పరిచయం చేసుకున్నారు. బూట్ల సరఫరా కాంట్రాక్టు ఇప్పిస్తామని, ఇందుకు రూ.17,65,000 అడ్మినిస్ట్రేటివ్, ఇతర ఛార్జీల నిమిత్తం చెల్లించాలని సూచించారు.
జీకే కుమార్, బెల్లి తేజ, ఆంజనేయులు సూచన మేరకు కంపెనీ ప్రతినిధులు.. 2019 డిసెంబరు 12న రూ. 4.50 లక్షలు ప్రవీణ్ వర్మ పేరుతో ఉన్న ఖాతాకు, డిసెంబరు 23న బెల్లితేజ ఖాతాకు రూ. 50 వేలు, 2020 ఫిబ్రవరి 20న రూ.2.25 లక్షలు ఆర్టీజీఎస్ చేశారు. స్వాతి పేరుతో ఉన్న ఖాతాకు రూ.లక్ష, విక్రమ్ పురి ఖాతాలో రూ. 2 లక్షలు జమ చేశారు. అనంతరం జీకే కుమార్ వారి నుంచి రూ.7.4 లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్టు రాకపోవడంతో తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని లిబర్టీ షూస్ ప్రతినిధులు కోరారు. ఆంజనేయులు తప్పుడు ఇన్వాయిస్లు తయారు చేసి వాట్సప్ ద్వారా పంపి నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై లిబర్టీ షూస్ ప్రతినిధి కమల్ ధావన్ బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఏడుగురిపై ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీకే కుమార్ గతంలో మంత్రి వద్ద సహాయకుడిగా పనిచేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. -
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ