కారు టైరు పేలి కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా కుష్ఠగి తాలూకా జాతీయ రహదారి 50పై కలికేరి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దుర్మరణం
గంగావతి, న్యూస్టుడే: కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా కుష్ఠగి తాలూకా జాతీయ రహదారి 50పై కలికేరి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. విజయపురకు చెందిన కుటుంబసభ్యులు ఆరుగురు కారులో బెంగళూరు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి... ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న రాచప్ప బనసోడె, రాఘవేంద్ర కాంబళె, అక్షయ శివశరణ, జయశ్రీ కాంబళె, చిన్నారులు రాఖీ, రష్మిక అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటకు లాగి మృతదేహాలను వెలికి తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్కు స్వర్ణం, కిశోర్కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్