దారి కాచి తెదేపా వర్గీయులపై దాడి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. దారి కాచి ఇనుప సుత్తి, రాడ్లతో ముగ్గురు తెదేపా కార్యకర్తలను దారుణంగా కొట్టారు.
ముగ్గురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
వైకాపా కార్యకర్తల అరాచకం
మచిలీపట్నం క్రైం, న్యూస్టుడే: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. దారి కాచి ఇనుప సుత్తి, రాడ్లతో ముగ్గురు తెదేపా కార్యకర్తలను దారుణంగా కొట్టారు. గాయపడిన వారిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం మేరకు ముస్లింల కబర్స్థాన్ కోసం ఇటీవల స్థానిక రాడార్ కేంద్రం వద్ద రెండెకరాల స్థలం కేటాయించారు. ఆ స్థలం తమ ప్రమేయం వల్లే సమకూరిందనే ప్రచారం విషయంలో ఇంగ్లీష్పాలేనికి చెందిన వైకాపాలోని రెండు వర్గాలవారు ఆదివారం ఘర్షణ పడి ఒకరిపై ఒకరు చిలకలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.
పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కు పిలిపించారు. ఒక వర్గంలో నిందితుడిగా ఉన్న మసీదు పెద్దను పరామర్శించేందుకు తెదేపాకు చెందిన సయ్యద్ బాజీ, చోటాబాబు, తదితరులు స్టేషన్కు వెళ్లారు. దీంతో వైకాపాలోని రెండో వర్గానికి చెందిన కార్యకర్తలు మోబిన్, గౌస్, మునీర్, తదితరులు ఆదివారం రాత్రి ఇంగ్లీష్పాలెం జెండా సెంటరులో కాపుకాసి బాజీ, చోటాబాబు, రిజ్వాన్లు ఇంటికి వెళ్తుండగా ఇనుప సుత్తి, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన ముగ్గురిని జిల్లా సర్వజనాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాజీ, బాబులను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపారు. బాజీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు