కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇరుగుపొరుగు కుటుంబాలకు చెందిన వారంతా కలిసి సరదాగా పర్యాటక ప్రాంతాల్ని చూసి రావాలని కారులో బయలుదేరారు.
10 మంది దుర్మరణం
ముగ్గురి పరిస్థితి విషమం
మైసూరు, న్యూస్టుడే: ఇరుగుపొరుగు కుటుంబాలకు చెందిన వారంతా కలిసి సరదాగా పర్యాటక ప్రాంతాల్ని చూసి రావాలని కారులో బయలుదేరారు. అప్పటిదాకా ఆనందంగా గడిపిన వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. కురుబూరు గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలలతో కలిపి పది మంది మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా బళ్లారి జిల్లా సంగనకల్లు నుంచి మైసూరు పర్యటనకు వచ్చారు. మలెమహదేశ్వర బెట్టకు వెళ్లి, మైసూరుకు తిరిగి వస్తున్న క్రమంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.
ఘటనా స్థలంలో నలుగురు మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఆరుగురు అసువులు బాశారు. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను చామరాజనగర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను మంజునాథ్ (35), కొట్రేశ్ (45), సుజాత (40), సందీప్ (23), పూర్ణిమ (30), గాయత్రి (28), శ్రావ్య (5), పవన్ (8), కార్తిక్ (8), కారు డ్రైవరు ఆదిత్య (34)గా గుర్తించారు. గాయపడిన వారిలో జనార్దన్ (45), పునీత్ (4), శశికుమార్ (24) పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మృతుల్లో మూడు కుటుంబాలకు చెందిన వారుండగా.. డ్రైవర్ మైసూరు ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!