Kodada: డాక్టర్ రాలేదని కాన్పు చేసిన నర్సులు.. వికటించి శిశువు మృతి
డాక్టర్ ఆస్పత్రికి రాలేదని నర్సులు చేసిన కాన్పు వికటించడంతో నవజాత శిశువు మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
కోదాడ రూరల్: డాక్టర్ ఆస్పత్రికి రాలేదని నర్సులు చేసిన కాన్పు వికటించడంతో నవజాత శిశువు మృతిచెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం వెంకట రామాపురానికి చెందిన మానసకు కాన్పుకోసం ఆస్పత్రిలో చేర్చారు.
మంగళవారం తెల్లవారుజామున మానసకు నొప్పులు రావడంతో అక్కడి సిబ్బంది వైద్యురాలికి సమాచారం అందించారు. ఆమె రాలేనని చెప్పడంతో నర్సులే నిర్లక్ష్యంగా కాన్పు చేశారు. శిశువుకు ప్రమాదంగా ఉందని.. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని హడావుడి చేశారు. ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం.. అంబులెన్స్ డ్రైవర్ కూడా ప్రైవేట్ ఆస్పత్రికి రానని చెప్పడంతో శిశువు మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు