సాహిల్కు పోలీసు కస్టడీ
దేశ రాజధాని దిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు సాహిల్కు స్థానిక మెజిస్టీరియల్ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది.
నిందితుడిని పట్టించిన ఫోన్కాల్
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు సాహిల్కు స్థానిక మెజిస్టీరియల్ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మంగళవారం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా.. విచారించిన డిప్యూటీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జ్యోతి నైన్ పోలీసు కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా నిందితుడిని పోలీసులు సాధారణ కోర్టు సమయానికి ముందే హాజరుపరిచారు. ఆదివారం రాత్రి నడిరోడ్డుపై సాక్షి అనే 16 ఏళ్ల బాలికను సాహిల్ కత్తితో 20 సార్లు పొడిచి బండరాయితో మోది కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని యూపీలోని బులంద్శహర్లో సోమవారం అరెస్టు చేశారు.
15 రోజుల క్రితమే కత్తి కొనుగోలు
సాక్షి హత్యకు ఉపయోగించిన కత్తిని సాహిల్ 15 రోజుల క్రితమే ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆ కత్తిని రిథాలా మెట్రో స్టేషన్ సమీపంలోని పొదల్లో పాడేసినట్లు పేర్కొన్నారు. బులంద్శహర్ వెళ్లిన సాహిల్ తన తండ్రికి ఫోన్ చేయడంతో లొకేషన్ను గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మాజీ ప్రియుడికి దగ్గర అవుతోందన్న కారణంతోనే సాక్షిని అంతమొందించినట్లు సాహిల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. దాడికి ముందు సాహిల్ మరో వ్యక్తితో మాట్లాడుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైనట్లు గుర్తించారు. ఘటన జరిగిన రోజు సాహిల్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్
మరోవైపు.. హత్యకు గురైన సాక్షి కుటుంబ సభ్యులను భాజపా, కాంగ్రెస్, ఆప్ పార్టీలకు చెందిన నేతలు మంగళవారం పరామర్శించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు