బాణసంచా పేలి ముగ్గురి దుర్మరణం
బాణసంచా పేలుడు ముగ్గురిని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం కువ్వాకుళ్లిలో ఈ ఉదంతం చోటుచేసుకుంది.
వరదయ్యపాళెం, న్యూస్టుడే: బాణసంచా పేలుడు ముగ్గురిని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం కువ్వాకుళ్లిలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. గ్రామ శివారులో వీరరాఘవులు అనే వ్యక్తి బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. మార్చితోనే లైసెన్సు గడువు ముగిసినప్పటికీ అనధికారికంగా టపాసుల్ని తయారు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం భారీ శబ్దంతో కూడిన పేలుడు సంభవించింది. భయభ్రాంతులకు గురైన స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా గ్రామానికి చెందిన సాథు నాగేంద్ర(31) మృతదేహం ఛిద్రమై కనిపించింది. దట్టమైన పొగ వ్యాపించడంతో గది లోపల ఎంతమంది మృతి చెందారో తొలుత గుర్తించలేకపోయారు. సత్యవేడు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. తర్వాత ఎల్లకట్టవకు చెందిన శంకరయ్య(50), గూడూరుకు చెందిన ఏడుకొండలు(45) మృతదేహాల్ని గుర్తించారు. తయారీ కేంద్రం ఆవరణలో ఉన్న వీరరాఘవులతో పాటు కల్యాణ్కుమార్ అనే మరోవ్యక్తీ పేలుడు ధాటికి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?