Hyderabad: ఈతకు దిగి వ్యక్తి మృతి.. మునిగిపోతున్న దృశ్యాలు వైరల్

బావిలో ఈతకు దిగి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది.

Updated : 01 Jun 2023 13:22 IST

హైదరాబాద్‌: బావిలో ఈతకు దిగి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. మృతుడిని ఎల్బీనగర్‌కు చెందిన రజాక్‌గా గుర్తించారు. రజాక్‌ మునిగిపోతుండగా అక్కడున్న కొందరు మొబైల్‌లో వీడియో తీశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రజాక్‌ మృతదేహం కోసం డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది గురువారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. మధ్యాహ్నానికి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని