యాత్రికులపై మంత్రి జోగి రమేష్ అనుచరుల దాష్టీకం
‘మేం ఎవరో తెలుసా? మా అన్న మంత్రి. జోగి రమేష్! ఆయన అనుచరులం.. మమ్మల్నే అడ్డుకుంటారా? మీ అంతు చూస్తాం!
జాతీయ రహదారిపై బస్సులు నిలిపి దౌర్జన్యం
మహిళల పట్ల అసభ్య ప్రవర్తన
విద్యార్థుల పేరుతో కేసులు లేకుండా పోలీసుల రాజీ
ఎమ్మెల్యే స్టిక్కర్ల కార్లతో హల్చల్
ఈనాడు, అమరావతి - ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్టుడే: ‘మేం ఎవరో తెలుసా? మా అన్న మంత్రి. జోగి రమేష్! ఆయన అనుచరులం.. మమ్మల్నే అడ్డుకుంటారా? మీ అంతు చూస్తాం! వస్తారుగా రండి.. మా అన్న అడ్డా ఇబ్రహీంపట్నం.. దాని మీదుగానే వెళ్తారుగా... ఎలా వెళ్తారో చూస్తాం..!’ ‘ఎవడ్రా.. మావాళ్ల మీద గొడవపడింది.. అంత దమ్ముందా? బస్సు పక్కన ఆపండి’ అంటూ కొందరు యువకులు యాత్రికులను భయభ్రాంతులకు గురిచేశారు. రెండు బస్సుల్లో ఉన్న మహిళలు, యువతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులకు ఫోన్ చేస్తామంటే.. ఓ యువకుడిని కొట్టి ఫోన్ లాక్కున్నారు. దాదాపు గంటసేపు బస్సులను జాతీయరహదారిపై ఆపేశారు. బస్సులోని యాత్రికులు 100కు ఫోన్ చేయగా.. ఇబ్రహీంపట్నం పోలీసులు వచ్చి ఇరువర్గాలను స్టేషన్కు తీసుకెళ్లి కేసులు లేకుండా పంపేశారు. విద్యార్థులు కావడంతో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము ఫిర్యాదు చేయట్లేదని బాధితుల వద్ద లేఖ రాయించుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన శనివారం వెలుగుచూసింది.
పల్నాడు జిల్లా ఫిరంగిపురం గ్రామస్థులు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దర్శనానికి రెండు బస్సుల్లో వెళ్లారు. అదే ఆలయానికి రెండు కార్లలో ఇబ్రహీంపట్నానికి చెందిన యువకులు 8మంది వచ్చారు. రెండు కార్లకు ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్నాయి. ఒక కారు నెంబరు ఏపీ 16ఎఫ్బీ3334. మరో తెలుపు వెర్నాకారుకు నంబరు లేదు. దేవాలయం వద్ద యాత్రికులలో ఉన్న మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కార్లలో పెద్ద శబ్దంతో పాటలు పెట్టారు. దీనిపై బస్సు డ్రైవర్ అభ్యంతరం పెట్టారు. పార్కింగ్ విషయంలోనూ డ్రైవర్తో ఘర్షణకు దిగారు. దీంతో ఆ యువకులు ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద జాతీయ రహదారిపై కాపుకాశారు. ఫిరంగిపురం బస్సులు రాగానే దాడికి దిగారు. దీంతో బస్సులోని వ్యక్తులు తిరగబడగా... వారిలో కొందరిని కొట్టారు. కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఎమ్మెల్యే స్టిక్కర్ల మాటేంటి?
పోలీసులు ఇరువర్గాలను తీసుకెళ్లగానే వైకాపా నేతలు రంగంలోకి దిగి, పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దాంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదుచేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనవసరంగా మహిళలపై కేసులు ఎందుకని భయపెట్టారు. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి రాజీ కుదిర్చి యాత్రికులతో లేఖ రాయించుకున్నారు. ఇదంతా సెల్ఫోన్లో చిత్రీకరించినవారు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగుచూసింది. ఆ రెండు కార్లకు ఎమ్మెల్యే స్టిక్కర్లు ఎలా వచ్చాయో కూడా పోలీసులు ఆరా తీయలేదు. పైగా ఘర్షణ జరుగుతున్న సమయంలోనే రెండు కార్ల నెంబరు ప్లేట్లు తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని