Kurnool: ఐదేళ్లు ప్రేమించి.. పెళ్లిపత్రిక రాయించుకొని.. మరొకరితో పెళ్లి
ఐదేళ్ల పాటు ప్రేమ పేరిట వెంట తిరిగిన యువకుడు.. నిశ్చితార్థం కూడా అయ్యాక మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
వయస్సులో పెద్దదంటూ యువకుడి మోసం
లేఖ రాసి యువతి బలవన్మరణం
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: ఐదేళ్ల పాటు ప్రేమ పేరిట వెంట తిరిగిన యువకుడు.. నిశ్చితార్థం కూడా అయ్యాక మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు విషద్రావణం తాగి ప్రాణాలు తీసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కర్నూలులోని పీవీ నరసింహారావుకాలనీకి చెందిన మల్లెపోగు మధు, షేకమ్మ దంపతుల కుమార్తె పద్మావతి(30) డిగ్రీ పూర్తయ్యాక ఓ వాహన షోరూంలో పదేళ్లుగా పనిచేస్తోంది. ఐదేళ్ల క్రితం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోటకు చెందిన వినోద్కుమార్ అలియాస్ ప్రవీణ్కుమార్ అదే షోరూంలో చేరాడు. ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. అనంతరం వినోద్ శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ పరిధిలోని కియా షోరూంలోకి ఉద్యోగం మారినా తరచూ పద్మావతికి ఫోన్ చేసేవాడు. తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పడంతో మార్చి 9న నిశ్చితార్థం చేశారు. రూ.లక్ష నగదు, బంగారం కట్నంగా ఇస్తామని పద్మావతి తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు. జూన్ 10 పెళ్లికి లగ్నపత్రిక రాశారు.
పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు
పద్మావతి తనకంటే వయస్సులో నాలుగేళ్లు పెద్దదని, బలవంతంగా నిశ్చితార్థం చేశారంటూ వినోద్కుమార్ జూపాడుబంగ్లా ఠాణాలో ఇటీవల ఫిర్యాదు చేశాడు. మే 29న వెంకాయపల్లె ఎల్లమ్మ ఆలయంలో మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారమిచ్చాడు. దీంతో పద్మావతి తల్లిదండ్రులు దిశ మహిళా పోలీసు స్టేషన్ను ఆశ్రయించారు. సోమవారం విచారణ జరగాల్సి ఉండగా తెల్లవారుజామున పద్మావతి విషద్రావణం తాగింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి చనిపోయింది. నాలుగో పట్టణ ఎస్సై మోహన్కిశోర్రెడ్డి మృతురాలి తల్లిదండ్రులను విచారించగా, ఆమె రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో ‘అమ్మా నాన్నా! నన్ను క్షమించండి. మీరు చెప్పిన మాట విననందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా గురించి బాధ పడకండి. తమ్ముడు, చెల్లి గురించి ఆలోచించండి. నా చావుకు కారణం వినోద్. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లుగా నా వెంట తిరిగాడు. నిశ్చితార్థం చేసుకుని లగ్నపత్రిక రాయించి, పెళ్లిపత్రికలు అచ్చు వేయించాక ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అతను నన్ను మోసగించాడు. వినోద్, అతని తలిదండ్రులు లక్ష్మీదేవి, బక్కన్న, బావ శోభన్, చిన్నాన్న మధుబాబు, ఐదుగురు మేనత్తలు నా చావుకు కారణం’ అని పేర్కొంది. ఈ లేఖ మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్