మాస్ కాపీయింగ్ సూత్రదారి ఏఈ రమేశ్ లీలలెన్నో!
టీఎస్పీఎస్సీ పరీక్షల్లో హైటెక్ మాస్కాపీయింగ్తో సంచలనం రేకెత్తించిన నిందితుడు ఏఈ పూల రమేశ్కుమార్ లీలలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి.
విచారణలో నేరచరిత్ర వెలుగులోకి..
ఈనాడు, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షల్లో హైటెక్ మాస్కాపీయింగ్తో సంచలనం రేకెత్తించిన నిందితుడు ఏఈ పూల రమేశ్కుమార్ లీలలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. కీలక వివరాలు రాబట్టేందుకు ఇతడిని సిట్ పోలీసులు ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మంగళవారం మూడ్రోజుల కస్టడీ ముగిసింది. ఇప్పటివరకూ అతడి నుంచి ముఖ్యమైన సమాచారం రాబట్టారు. సాంకేతిక పరిజ్ఞానంపై అపారమైన పట్టున్న రమేశ్ గతంలోనూ మాస్కాపీయింగ్లో సహకరించి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. పోలీసు విచారణలో అతడి గత నేరచరిత్ర కూడా వెలుగు చూసింది.
పూల రమేశ్కుమార్ స్వస్థలం ఏపీలోని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట. అక్కడే ఉన్నత విద్య పూర్తిచేశాడు. చదువులో టాపర్గా ఉండే ఇతడు 2011లో మెరిట్ జాబితాలోనే నీటిపారుదలశాఖలో ఏఈ ఉద్యోగం సంపాదించాడు. అదే సమయంలో ఏఈ కొలువు సంపాదించిన యువతితో వివాహమైంది. ప్రస్తుతం ఆమె వరంగల్ జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగైదేళ్లు సజావుగానే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో బి.కొత్తకోట ఠాణా పరిధిలో ఒక మహిళ హత్యకేసులో రమేశ్ అరెస్టై జైలుకెళ్లాడు. ఆ తరువాత ఉద్యోగం నుంచి తొలగించడంతో ఖాళీగా ఉన్నాడు. ఆ సమయంలో సంపాదన కోసం తప్పటడుగులు వేసినట్టు తెలుస్తోంది. 2018లో తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకున్నారు. కేవలం 8 నెలలు మాత్రమే ఉద్యోగంలో కొనసాగాడు. ఆ తరువాత ప్రభుత్వ కొలువు వదిలేసి ఇతర వ్యాపకాలలో మునిగిపోయాడు. కరీంనగర్లో కొంతకాలం పనిచేయడంతో అక్కడి వారితో పరిచయాలున్నాయి. ప్రస్తుతం హత్యకేసు న్యాయస్థానంలో ట్రయల్ నడుస్తోంది. టీఎస్పీఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ వెలువడ్డాక హైటెక్ మాస్ కాపీయింగ్ వైపు దృష్టిసారించాడు. పాత పరిచయాలను వాడుకుని సురేష్ ద్వారా ప్రశ్నపత్రాలు సేకరించి 78 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నగర సిట్ పోలీసులు ఏఈఈ, డీఏఓ పరీక్షల్లో టాపర్ల వివరాలు సేకరిస్తున్న సమయంలో రమేశ్ అక్రమాల బాగోతం వెలుగు చూసింది. కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నపుడు ఈ అక్రమాలు బయటపడ్డాయి.
కళాశాల ప్రిన్సిపల్కు రూ.8 లక్షలు...
రమేశ్ హైటెక్ మాస్కాపీయింగ్లో ఏడుగురు అభ్యర్థులకు సహకరించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో సహకరించిన టోలిచౌకి కళాశాల ప్రిన్సిపల్ పేరు అలీ అని మొదట్లో చెప్పినా తరువాత అతని అసలు పేరు మహ్మద్పాషా అని, అభ్యర్థుల నుంచి తన చేతికి అందిన సొమ్ములో రూ.8 లక్షలు పాషాకు ఇచ్చినట్టు విచారణలో తెలియజేసినట్లు సమాచారం. ఇతడి నుంచి రాబట్టిన వివరాలతో ఏడుగురు అభ్యర్థులు, ప్రిన్సిపల్, ఏఈ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన 78 మందిని సిట్ పోలీసులు గుర్తించారు. వీరికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా పోలీసుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ జాబితాలో కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. -
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్