ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో చోటు చేసుకుంది.
చిన్నశంకరంపేట, న్యూస్టుడే: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో చోటు చేసుకుంది. ఎస్సై సుభాష్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ(45) తన రెండెకరాల్లో వరి సాగు చేశారు. పంట పెట్టుబడితోపాటు గతేడాది సోదరి వివాహం కోసం రూ.4 లక్షల వరకు అప్పు చేశారు. చేతికొచ్చిన పంట వర్షాలకు తడిసింది. అష్టకష్టాలు పడి ఆరబెట్టిన తరువాత 12 రోజుల క్రితం ఖాజాపూర్ కొనుగోలు కేంద్రంలో విక్రయించగా 47 క్వింటాళ్లే వచ్చాయి.ఈ నగదు ఇంకా జమకాలేదు. తక్కువ డబ్బులు వస్తాయన్న దిగులుతోపాటు అప్పులెలా తీర్చాలనే మనోవేదనతో ఈ నెల 4న పురుగు మందు తాగారు. కుటుంబసభ్యులు గమనించి మొదట మెదక్ ఏరియా ఆసుపత్రికి, తరువాత సికింద్రాబాద్లోని గాంధీకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం