Srikakulam: కొట్లాటకు దారి తీసిన ప్రేమ వివాహం
బూర్జ మండలంలోని కొల్లివలసలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఓ ప్రేమ వివాహం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది.
కొల్లివలసలో ఉద్రిక్తత
బూర్జ: బూర్జ మండలంలోని కొల్లివలసలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఓ ప్రేమ వివాహం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల కొట్లాటకు దిగడంతో పలువురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన ఓ జంట జూన్ 1న ప్రేమ వివాహం చేసుకున్నారు. చాలాకాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నా.. వేర్వేరు సామాజిక వర్గాలు కావడంతో అమ్మాయి ఇంట్లో అంగీకరించలేదు. దీంతో ఇద్దరు వెళ్లిపోయి రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తమకు రక్షణ కల్పించాలని, బుధవారం వస్తున్నామని ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమ్మాయి కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా అబ్బాయి ఇంటి మీదకు వెళ్లడంతో గొడవ జరిగింది. అక్కడ మాటా మాటా పెరిగి ఇరువర్గాలు కొట్లాటకు దిగాయి. కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. సమాచారం తెలియగానే ఎస్సై బి.అశోక్బాబు సిబ్బందితో గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఘటనలో అయిదుగురు గాయపడినట్లు గుర్తించామని, దీనిపై విచారించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ చెప్పారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు