బధిర మహిళపై అత్యాచారయత్నం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో బధిర మహిళపై అత్యాచారయత్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం కందుకూరు వచ్చారు.
దిశయాప్లో ఫిర్యాదు చేసిన స్థానికులు
సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులు
కందుకూరు పట్టణం, నెల్లూరు (నేర విభాగం), న్యూస్టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో బధిర మహిళపై అత్యాచారయత్నం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన ఓ మహిళ మంగళవారం సాయంత్రం కందుకూరు వచ్చారు. బస్టాండ్ నుంచి రాత్రి కొండముడుసుపాలెం వైపు నడుచుకుంటూ వెళుతుండగా.. పెట్రోల్ బంక్ సమీపాన ముగ్గురు వ్యక్తులు ఊరికి తీసుకెళతామని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. తర్వాత రోడ్డు పక్కకు బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించారు. ఆమె గట్టిగా అరవడంతో సమీపంలోనే ఉన్న పెట్రోల్ బంకు సిబ్బంది దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. దగ్గర్లోనే ఉన్న గస్తీ పోలీసులు బంకు సిబ్బందితో కలసి వెళ్లి ఆమెను రక్షించారు. పారిపోయిన నిందితులను పట్టుకున్నారు. వారిలో ఇద్దరు నేపాల్ నుంచి వచ్చి పట్టణంలో గూర్ఖాలుగా పనిచేస్తున్న కరణ్, జోషి కాగా మరొకర్ని పట్టణంలో ఆటోడ్రైవర్ సయ్యద్ఫిరోజ్గా గుర్తించినట్లు డీఎస్పీ ఎ.రామచంద్ర వెల్లడించారు. ఆయన సీఐతో కలసి బుధవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితులపై ఎట్రాసిటీ, అత్యాచార యత్నం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధితురాలిని ఇంటికి చేర్చామని తెలిపారు. దిశ యాప్ ద్వారా మహిళను సకాలంలో రక్షించినట్లు ఎస్పీ కె.తిరుమలేశ్వరరెడ్డి నెల్లూరులో విలేకర్లకు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!