Cybercrime: సైబర్ నేరాలపై సరికొత్త ‘అస్త్రం’
రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ మోసాలను అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
తరచూ మోసాలకు పాల్పడుతున్న ఫోన్ నంబర్ల శాశ్వత బ్లాక్
ఈనాడు, హైదరాబాద్
రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్ మోసాలను అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అనుమానిత నంబర్లను గుర్తించి, వాటిని శాశ్వతంగా బ్లాక్ చేస్తోంది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ఈ నేరాలను అరికట్టాలంటే అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ కృషి చేయాల్సిందేనని భావిస్తున్న అధికారులు తాజాగా అమలు చేస్తున్న ఈ విధానం సత్ఫలితాన్ని ఇస్తోందని చెబుతున్నారు.
రాష్ట్రంలో గత నాలుగేళ్లలో సైబర్ నేరాలు ఆరు రెట్లు పెరిగాయి. 2019లో కేవలం 2,691 సైబర్ నేరాలు నమోదు కాగా 2022 నాటికి అవి 15,217కు చేరుకున్నాయి. ఇందులో 90 శాతంపైగా ఆర్థిక మోసాలే ఉన్నాయి. దేశ విదేశాల్లో పెద్దసంఖ్యలో సైబర్ నేరాల ముఠాలు తయారయ్యాయి. వీరు రకరకాల పద్ధతుల్లో ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. వీరి మోసాలపై ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నా నేరాలు తగ్గడం లేదు. జరుగుతున్న మోసాలకు, సెల్ఫోన్కు ఏదో ఒక రూపంలో లింకు ఉంటోంది. ఫోన్ చేసి మాట్లాడడంగానీ, ఫోన్లో సందేశం పంపిగానీ, నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే అడ్డగోలుగా సిమ్కార్డులు అమ్మకుండా కట్టడి చేయాలని, తద్వారా సైబర్నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎప్పడి నుంచో డిమాండ్ ఉంది. రకరకాల కారణాలతో అది ఆచరణకు నోచుకోవడంలేదు. దీంతో తెలంగాణ పోలీసులు మరో వినూత్న పద్ధతి ఎంచుకున్నారు.
సైబర్ నేరాలు అరికట్టేందుకు తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ) పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఫిర్యాదులను సమూలంగా పరిశీలిస్తున్నారు. నేరగాళ్ల ఫోన్ నంబర్లు, ఐపీ చిరునామాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. పదేపదే వస్తున్న నంబర్లను గుర్తించి ఓ జాబితా తయారు చేస్తున్నారు. దాన్ని ‘నేషనల్ సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)కి పంపుతున్నారు. ఈ నంబర్ల నుంచి ఫోన్లు చేసి, సందేశాలు పంపించి ఫలానా వ్యక్తులను మోసం చేశారు కాబట్టి వీటిని శాశ్వతంగంఆ బ్లాక్ చేయించమని ఎన్పీఆర్పీని కోరుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 200 పైగా నంబర్లు ఇలా పంపారు. వాటిద్వారా మోసం జరిగిందని కేసు నమోదు చేశారు కాబట్టి, సంబంధిత నంబర్ను బ్లాక్ చేయాలని ఎన్సీఆర్పీ సంబంధింత సర్వీస్ ప్రొవైడర్కు లేఖ రాస్తోంది. రాజస్థాన్లోని భరత్పూర్ వంటి ప్రాంతంలో అయితే ఎవరికివారే వ్యక్తిగతంగా నేరాలు చేస్తుంటారు. ఇటువంటివారి నంబర్ బ్లాక్ చేయించగలిగితే మరో నంబర్ తీసుకొని మోసాలు మొదలుపెట్టడానికి కొంత సమయం పడుతుంది. పదేపదే సిమ్కార్డులు తీసుకోవడం కొంత కష్టం కావచ్చని... తద్వారా పూర్తిగా ఆగిపోకపోయినా మోసాలు నెమ్మదించే అవకాశమయినా ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. సైబర్నేరాలు అడ్డుకునేందుకు తీసుకుంటున్న అనేక చర్యల్లో ఇది ప్రధానమైందని ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణ ముగిసింది. గురువారం అర్ధరాత్రి వరకు ఆయన్ను దర్యాప్తు బృందం విచారించింది. -
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
వైకాపా నేత బావమరిది నకిలీ కరెన్సీ నోట్లతో ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేయబోయి అక్కడి సిబ్బందికి దొరికిపోయాడు. -
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులకు రేటింగ్ ఇస్తే మంచి కమీషన్ ముట్టజెబుతామని భారీ మోసానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దేశవ్యాప్తంగా 580 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.32.34 కోట్ల నగదును జప్తు చేశారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో తనిఖీలు
బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. -
ముంబయిలో రూ.6 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురు వ్యక్తుల నుంచి 3 కిలోల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షలో జవాబు పత్రం చూపించలేదని ఘోరం
పదో తరగతి పరీక్షలో తమకు జవాబు పత్రం చూపించలేదన్న ఆగ్రహంతో ఓ విద్యార్థిపై ముగ్గురు సహచర విద్యార్థులు తీవ్రంగా దాడి చేసి కత్తితో గాయపరిచిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
అయిదేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడి అరెస్టు
దేశ రాజధానిలో దిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. అయిదేళ్ల చిన్నారిపై ఓ ఫ్యాక్టరీ కార్మికుడు అత్యాచారానికి పాల్పడి హతమార్చాడు. -
గ్రూప్-1 ఉద్యోగాల పేరిట టోకరా.. పోలీసుల అదుపులో నిందితుడు
‘గ్రూప్-1’ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన ముఠాలో ఓ నిందితుడిని వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కోటాలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్లో పోటీ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. -
ఛత్తీస్గఢ్ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు
మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దున కాంకర్ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య బుధ, గురువారాల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. -
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
ఎయిర్ బ్లోయర్ నాజిల్ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు