Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. ప్రియుడితో కలిసి తల్లి హత్య
ఉత్తర్ప్రదేశ్లో ఓ యువకుడు తమ ప్రేమకు అడ్డు చెబుతోందన్న కోపంతో ప్రియురాలి తల్లిని పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపాడు.
ఉత్తర్ప్రదేశ్లో ఓ యువకుడు తమ ప్రేమకు అడ్డు చెబుతోందన్న కోపంతో ప్రియురాలి తల్లిని పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపాడు. ఈ హత్య వెనుక మృతురాలి మైనర్ కుమార్తె పాత్ర కూడా ఉందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆగ్రాలోని భావనా అరోమా హౌసింగ్ సొసైటీ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఫుట్వేర్ వ్యాపారి అయిన ఉదిత్ బజాజ్, అంజలి బజాజ్ దంపతులకు ఓ కుమార్తె ఉంది. బుధవారం రాత్రి నుంచి తన భార్య అంజలి కనిపించడం లేదని ఉదిత్.. సికంద్ర పోలీస్స్టేషనులో ఫిర్యాదు చేశాడు. అంజలి సమీపంలోని మహాదేవ్ ఆలయానికి వెళ్లి తిరిగిరాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం సాయంత్రం మహాదేవ్ ఆలయ సమీపంలో అంజలి మృతదేహాన్ని గుర్తించారు.
ఇదీ జరిగింది..: తల్లిని మహాదేవ్ ఆలయానికి రప్పించిన కుమార్తె.. ఆమెకు తోడుగా వచ్చిన తండ్రికి తెలివిగా ఫోను చేసి మరోచోటుకు వెళ్లేలా చేసింది. కాసేపటికి తిరిగి వచ్చిన ఉదిత్కు అక్కడ భార్య కనిపించలేదు. వయసులో పెద్దవాడైన ప్రాకర్ గుప్తాతో తమ కుమార్తె ప్రేమను అంజలి అంగీకరించలేదు. ఈ కారణంగా ప్రేయసి తల్లిపై కోపం పెంచుకున్న ప్రాకర్ ఆమెను హత్య చేశాడు. ఇందులో అంజలి కుమార్తె, ప్రాకర్ స్నేహితుడి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. -
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!