కుక్కలకు ఆహారంగా ‘ఆమె’ శరీర భాగాలు!
మహారాష్ట్రలోని ఠాణెలో వెలుగుచూసిన మహిళ దారుణహత్య కేసులో అనూహ్య విషయాలు బయటకొస్తున్నాయి. సరస్వతి వైద్య (36) మృతదేహ భాగాలను నిందితుడు మనోజ్ సానె (56) కుక్కలకు ఆహారంగా వేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఠాణె హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి..
సరస్వతిది ఆత్మహత్య అంటున్న నిందితుడు
ముంబయి: మహారాష్ట్రలోని ఠాణెలో వెలుగుచూసిన మహిళ దారుణహత్య కేసులో అనూహ్య విషయాలు బయటకొస్తున్నాయి. సరస్వతి వైద్య (36) మృతదేహ భాగాలను నిందితుడు మనోజ్ సానె (56) కుక్కలకు ఆహారంగా వేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారని, ఆ విషయాన్ని దాచిపెట్టారని పోలీసులు శుక్రవారం తెలిపారు. సరస్వతికి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారని, వారి వాంగ్మూలం నమోదు చేశామన్నారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యాక మృతురాలి దేహ అవశేషాలను తోబుట్టువులకు అందజేస్తామని డీసీపీ జయంత్ బజ్బలే చెప్పారు. మరోవైపు.. సరస్వతిని తాను చంపలేదని, ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకొందని నిందితుడు మనోజ్ చెబుతున్నాడు. హెచ్ఐవీ పాజిటివ్తో బాధపడుతున్న తనకు ఆమెతో శారీరక సంబంధాలు లేవని, సరస్వతి తన కుమార్తెతో సమానమనీ అంటున్నాడు. జూన్ 3న తాను బయటి నుంచి ఇంటికి వచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకొని ఉందని, కేసులో ఇరుక్కుంటానన్న భయంతో మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నానని తెలిపాడు.
శ్రద్ధావాకర్ హత్య తరహాలో..
దిల్లీలో జరిగిన కాల్సెంటర్ ఉద్యోగిని శ్రద్ధావాకర్ హత్య తరహాలో మృతదేహాన్ని ముక్కలు చేశానని, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఇది విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా కావచ్చని, ఏ విషయం దర్యాప్తులో తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొద్దిరోజులుగా నిందితుడు కుక్కలకు తరచూ ఆహారం పెడుతున్నాడని స్థానికులు చెబుతున్నట్లు తెలిపారు. ఆ శునకాలకు ఆమె శరీర భాగాలనే పెట్టాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మనోజ్ పడకగదిలో శరీర భాగాలున్న పెద్ద ప్లాస్టిక్ సంచులు, రక్తమోడుతున్న చెట్లు నరికే యంత్రాన్ని నయానగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. ప్రస్తుతానికి నిందితుడిపై హత్య, ఆధారాల ధ్వంసం సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. మనోజ్ను న్యాయస్థానంలో హాజరుపరచగా, జూన్ 16 వరకు పోలీసు కస్టడీకి జడ్జి ఆదేశించారు.
* ఐటీఐలో శిక్షణ పొందిన మనోజ్ సరైన ఉద్యోగం దొరక్క గత పదేళ్లుగా రేషన్ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడే సరస్వతితో పరిచయం ఏర్పడి, ఆమెకు సేల్స్ పర్సన్గా ఉద్యోగం ఇప్పించాడు. 2014 నుంచి సాన్నిహిత్యం పెరిగి, 2016 నుంచి ఇద్దరూ కలిసి ఉండటం ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్