దర్యాప్తునకు భయపడి... ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు!
ఒక హత్య కేసులో భాగంగా నిందితుల ఆచూకీ కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులను చూసి భయపడ్డ యువకుడు పక్క భవనంపైకి దూకి తీవ్రంగా గాయపడ్డాడు.
హత్యకేసు విచారణకు హైదరాబాద్ వచ్చిన ఏపీ పోలీసులు
భయపడి పక్క భవనంపై దూకిన యువకుడికి తీవ్రగాయాలు
హైదరాబాద్, న్యూస్టుడే: ఒక హత్య కేసులో భాగంగా నిందితుల ఆచూకీ కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులను చూసి భయపడ్డ యువకుడు పక్క భవనంపైకి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్లోని కేపీహెచ్బీలో సోమవారం సాయంత్రం జరిగిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతిగృహం, పోలీసుల వివరాల ప్రకారం..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పరిధిలోని ఈదరపల్లిలో సెప్టెంబరు 1న పోలిశెట్టి కిశోర్, అడపా సాయి లక్ష్మణ్పై కొందరు దాడిచేశారు. ఈ దాడిలో పోలిశెట్టి కిశోర్ మృతిచెందాడు. ఈ హత్యకు సంబంధించి నిందితుల సమాచారం కోసం అమలాపురం పోలీసులు ఈ నెల 18న సాయంత్రం హైదరాబాద్లోని మాదాపూర్కు వచ్చారు. నిందితులకు ఆశ్రయం ఇచ్చారన్న సమాచారంతో మాదాపూర్లో ఉద్యోగం చేసే పోలిశెట్టి ఫణిశంకర్ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. ఫణిశంకర్ తనకేమీ తెలియదని... కేపీహెచ్బీలో ఉండే ఫార్మా ఉద్యోగి మాచిరాజు ఫణిశ్రీనివాస్(25)కు సమాచారం ఉంటుందని చెప్పాడు. పోలీసులు ఫణిశ్రీనివాస్ ఉండే కేపీహెచ్బీలోని శ్రీబాలాజీ వసతిగృహానికి రాత్రి 8.30 గంటల సమయంలో చేరుకున్నారు. అప్పటికే పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో గదికి తాళం వేసిన ఫణిశ్రీనివాస్ భయంతో నాలుగో అంతస్తు నుంచి పక్కనున్న భవనంపైకి దూకాడు. ఆ భవనం మూడో అంతస్తులోని పెంట్హౌస్పై తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. శ్రీనివాస్ను ఈఎస్ఐ ఆసుపత్రిలో చేర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Crime News: తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనకూరులో తమ్ముడిని అన్న గొడ్డలితో నరికి చంపాడు. అన్నదమ్ములు రవికుమార్, కృష్ణమూర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. -
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య
ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. వివాహ వేడుకలో పాత్రలు తీసుకువెళుతున్న ట్రే అతిథులకు తగిలిందనే కారణంతో వెయిటర్ను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. -
తండ్రి దెబ్బలకు మూడేళ్ల కుమారుడి బలి
తండ్రి దెబ్బలకు మూడేళ్ల పసివాడు బలయ్యాడు. విషాదకరమైన ఈ సంఘటన మహేశ్వరం పరిధిలోని అమీర్పేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. -
చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి దాడి
ఉత్తర్ప్రదేశ్లోని మిర్జాపుర్లో దారుణం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ చోరీ చేశాడన్న అనుమానంతో ఓ యువకుణ్ని కొందరు వ్యక్తులు చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి విచక్షణారహితంగా చితకబాదారు. -
పీఎఫ్ఐ కుట్ర కేసులో మూడో అభియోగ పత్రం
నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం మూడో అభియోగపత్రం దాఖలు చేసింది. -
‘నీ భార్యను అమ్మేసైనా డబ్బు కట్టాల్సిందే!’
బాకీ ఉన్న డబ్బు కోసం బెదిరించడంతో పాటు నీ భార్యను అమ్మేసైనా సొమ్ము కట్టాలంటూ వైకాపా నాయకులు అవమానించడంతో మనస్తాపానికి గురై మైనార్టీ వర్గానికి చెందిన చేనేత కార్మికుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
వరకట్నం కారణంగా పెళ్లి ఆగిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
Jawan: హాలీవుడ్ అవార్డుల బరిలో ‘జవాన్’.. భారత్ నుంచి ఏకైక చిత్రమిదే..
-
PM Modi: కృత్రిమ మేధా రంగంలో ముందడుగుకు యత్నాలు..: మోదీ
-
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా
-
వాట్సప్లో ఇకపై వాయిస్ మెసేజ్లకు ‘వ్యూ వన్స్’.. త్వరలో ఈ ఫీచర్ కూడా..
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు.. అప్పుడు హీరోలు వీరే!
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్