స్నేహితుల మధ్య చిచ్చురేపిన సిగరెట్?
సిగరెట్ కోసం జరిగిన ఘర్షణలో ఓ బాలుడిని తోటి స్నేహితులు గొంతుకోసి హతమార్చిన ఘటన విశాఖలో కలకలం సృష్టించింది.
సహచరుడి గొంతుకోసి హతమార్చిన వైనం
విశాఖపట్నం, న్యూస్టుడే: సిగరెట్ కోసం జరిగిన ఘర్షణలో ఓ బాలుడిని తోటి స్నేహితులు గొంతుకోసి హతమార్చిన ఘటన విశాఖలో కలకలం సృష్టించింది. సీఐ రేవతమ్మ కథనం ప్రకారం... ఏవీఎన్ కళాశాల సమీపంలో నూకాలమ్మ అనే మహిళ తన కుమారుడు చిన్నా(17)తో కలిసి నివసిస్తోంది. చిన్నా కొద్దికాలంగా వ్యసనాలకు బానిసయ్యాడు. పాతనగరంలోని విస్కీ అనే రౌడీషీటర్ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఈ నెల 20న స్నేహితులతో కలిసి చవితి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. 21 అర్ధరాత్రి దాటాక చిన్నా, మరో నలుగురు బాలురు సిగరెట్లు తాగారు. సిగరెట్ విషయమై వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో స్నేహితులు కత్తితో చిన్నాను గొంతు కోసి హతమార్చి గోనె సంచితో మృతదేహాన్ని దాచిపెట్టారు. వినాయకచవితి ఉత్సవ సామగ్రిని సముద్రంలో కలపాలని తెల్లవారుజామున ఆటోడ్రైవర్ రాముతో బేరం కుదుర్చుకున్నారు. మృతదేహాన్ని ఆటోలో చేపలరేవు వద్దకు తీసుకెళ్లి సముద్రంలో విసిరేసి వెళ్లిపోయారు. మృతదేహం దొరికిన తర్వాత పోలీసులు ఆటోడ్రైవర్ను గుర్తించి విచారించగా నలుగురు పిల్లల గురించి చెప్పాడు. వారిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఆ నలుగురినీ జువైనల్ హోంకు తరలించారు. పిల్లల మధ్య ఘర్షణకు గంజాయి కారణమై ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sangareddy: కారు బోల్తా.. బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. -
నిందితులను అరెస్టు చేయకపోతే మాకు ప్రాణహాని
తన బిడ్డ చావుకు కారకులను అరెస్టు చేయకపోతే తమ కుటుంబానికి ప్రాణహాని ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో ఆత్మహత్య చేసుకున్న బొంతా మహేంద్ర తల్లి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. -
YSRCP Leader: అమెరికాలో వైకాపా నాయకుడి దాష్టీకం
వైకాపా నేతల అరాచకాలు, దౌర్జన్యాలు అమెరికానూ తాకాయి. ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలుండి క్రియాశీలకంగా వ్యవహరించే సత్తారు వెంకటేశ్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల వయసున్న ఓ నిరుపేద యువకుడ్ని అక్కడ కొన్ని నెలలుగా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. -
భద్రాద్రి జిల్లాలో 40 కిలోల ల్యాండ్మైన్ వెలికితీత
పోలింగ్ విధులకు హాజరైన భద్రతా బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రను భగ్నం చేసినట్లు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ వెల్లడించారు. -
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
మణిపుర్లో 10 మంది దుండగులు ఓ బ్యాంకులోకి తుపాకులతో చొరబడి రూ.18.80 కోట్లు దోచుకున్నారు. ఉఖ్రుల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన 8 మంది రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. -
బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు
బడి గంటలు మోగక ముందే.. శుక్రవారం ఉదయమే బెంగళూరులోని ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
ఛత్తీస్గఢ్లో ఉపసర్పంచి హత్య
ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 23వ వారోత్సవాల వేళ విధ్వంసానికి పాల్పడటంతోపాటు ఓ ఉపసర్పంచిని హత్య చేశారు. -
మావోయిస్టులకు ఆయుధాల తరలింపు కేసులో 8 మందిపై అభియోగపత్రం దాఖలు
మావోయిస్టులకు పేలుడు పదార్థాలతోపాటు ఆయుధాల తయారీ సామగ్రిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఎనిమిది మంది నిందితులపై హైదరాబాద్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) న్యాయస్థానంలో శుక్రవారం అభియోగ పత్రాలు దాఖలయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
WPL Auction: డిసెంబర్ 9న డబ్ల్యూపీఎల్ వేలం.. స్లాట్లు 30.. అందుబాటులోకి 165 మంది
-
Whatsapp: వాట్సప్లో యూజర్ నేమ్.. చాట్స్కు సీక్రెట్ కోడ్!
-
Pawan Kalyan: నేను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చూపిస్తా: పవన్ కల్యాణ్
-
Animal: రణ్బీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్.. ‘యానిమల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే!
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి