విస్తార వర్షాలతో ముగ్గురి మృతి
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్ మండలంలో శనివారం వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు.
పిడుగుపాటుతో ఇద్దరు, వాగులో కొట్టుకుపోయి ఒకరి దుర్మరణం
ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం
ఈనాడు, హైదరాబాద్, ఆసిఫాబాద్, న్యూస్టుడే: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆసిఫాబాద్ మండలంలో శనివారం వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. ఆసిఫాబాద్ పంచాయతీ పరిధిలోని హీరాపూర్కు చెందిన తల్లీకూతుళ్లు లక్ష్మీబాయి, చంద్రకళ(24) శనివారం మధ్యాహ్నం పొలం పనుల్లో ఉండగా వారిద్దరిపై పిడుగు పడింది. చంద్రకళ అక్కడికక్కడే మృతిచెందగా.., లక్ష్మీబాయి గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిర్రకుంట పంచాయతీ పరిధిలోని గుట్టచెలిమకు చెందిన యువకుడు దేవురావు(24) చేను పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగొస్తుండగా పిడుగుపడి మృతిచెందారు. ఇదే పంచాయతీ పరిధిలోని ఎర్రగుట్టకు చెందిన భీమ్బాయి(55) గ్రామ సమీపంలో వాగు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. పక్క గ్రామంలో ఆమె మృతదేహం లభ్యమైంది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షాలు
ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో శనివారం 7 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ 5.6, మంచిర్యాల జిల్లా మందమర్రి 4.3, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి 3.8, నిర్మల్ జిల్లా మామ్డ 3.7, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి 3, కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలో 2.9 సెం.మీటర్లు కురిసింది. ఆదివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కొనసాగే సూచనలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిందితులను అరెస్టు చేయకపోతే మాకు ప్రాణహాని
తన బిడ్డ చావుకు కారకులను అరెస్టు చేయకపోతే తమ కుటుంబానికి ప్రాణహాని ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో ఆత్మహత్య చేసుకున్న బొంతా మహేంద్ర తల్లి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. -
అమెరికాలో వైకాపా నాయకుడి దాష్టీకం
వైకాపా నేతల అరాచకాలు, దౌర్జన్యాలు అమెరికానూ తాకాయి. ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలుండి క్రియాశీలకంగా వ్యవహరించే సత్తారు వెంకటేశ్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల వయసున్న ఓ నిరుపేద యువకుడ్ని అక్కడ కొన్ని నెలలుగా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. -
భద్రాద్రి జిల్లాలో 40 కిలోల ల్యాండ్మైన్ వెలికితీత
పోలింగ్ విధులకు హాజరైన భద్రతా బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రను భగ్నం చేసినట్లు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ వెల్లడించారు. -
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
మణిపుర్లో 10 మంది దుండగులు ఓ బ్యాంకులోకి తుపాకులతో చొరబడి రూ.18.80 కోట్లు దోచుకున్నారు. ఉఖ్రుల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన 8 మంది రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. -
బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు
బడి గంటలు మోగక ముందే.. శుక్రవారం ఉదయమే బెంగళూరులోని ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
ఛత్తీస్గఢ్లో ఉపసర్పంచి హత్య
ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 23వ వారోత్సవాల వేళ విధ్వంసానికి పాల్పడటంతోపాటు ఓ ఉపసర్పంచిని హత్య చేశారు. -
మావోయిస్టులకు ఆయుధాల తరలింపు కేసులో 8 మందిపై అభియోగపత్రం దాఖలు
మావోయిస్టులకు పేలుడు పదార్థాలతోపాటు ఆయుధాల తయారీ సామగ్రిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఎనిమిది మంది నిందితులపై హైదరాబాద్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) న్యాయస్థానంలో శుక్రవారం అభియోగ పత్రాలు దాఖలయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!