విమానాశ్రయంలో 1.6 కిలోల బంగారం పట్టివేత
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.633 కిలోల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారులు శనివారం పట్టుకున్నారు.
ముగ్గురు ప్రయాణికుల అరెస్ట్
శంషాబాద్, న్యూస్టుడే: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.633 కిలోల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారులు శనివారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు రస్ అల్ ఖైమా నుంచి స్వదేశానికి బయల్దేరారు. ఈ క్రమంలో 1.633 కిలోల బరువున్న 14 బంగారం బిస్కెట్లను తమ సామగ్రిలో రహస్యంగా పెట్టుకొని తీసుకొచ్చారు. విమానాశ్రయంలో ఆ ప్రయాణికుల ప్రవర్తనపై భద్రతాధికారులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని, వారి సామగ్రిని తనిఖీ చేయగా అక్రమ బంగారం తరలింపు బయటపడింది. రూ.99.57 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Sangareddy: కారు బోల్తా.. బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. -
నిందితులను అరెస్టు చేయకపోతే మాకు ప్రాణహాని
తన బిడ్డ చావుకు కారకులను అరెస్టు చేయకపోతే తమ కుటుంబానికి ప్రాణహాని ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో ఆత్మహత్య చేసుకున్న బొంతా మహేంద్ర తల్లి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. -
YSRCP Leader: అమెరికాలో వైకాపా నాయకుడి దాష్టీకం
వైకాపా నేతల అరాచకాలు, దౌర్జన్యాలు అమెరికానూ తాకాయి. ఆ పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలుండి క్రియాశీలకంగా వ్యవహరించే సత్తారు వెంకటేశ్రెడ్డి.. ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల వయసున్న ఓ నిరుపేద యువకుడ్ని అక్కడ కొన్ని నెలలుగా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. -
భద్రాద్రి జిల్లాలో 40 కిలోల ల్యాండ్మైన్ వెలికితీత
పోలింగ్ విధులకు హాజరైన భద్రతా బలగాలపై దాడి చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రను భగ్నం చేసినట్లు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ వెల్లడించారు. -
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
మణిపుర్లో 10 మంది దుండగులు ఓ బ్యాంకులోకి తుపాకులతో చొరబడి రూ.18.80 కోట్లు దోచుకున్నారు. ఉఖ్రుల్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన 8 మంది రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. -
బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపు
బడి గంటలు మోగక ముందే.. శుక్రవారం ఉదయమే బెంగళూరులోని ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
ఛత్తీస్గఢ్లో ఉపసర్పంచి హత్య
ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 23వ వారోత్సవాల వేళ విధ్వంసానికి పాల్పడటంతోపాటు ఓ ఉపసర్పంచిని హత్య చేశారు. -
మావోయిస్టులకు ఆయుధాల తరలింపు కేసులో 8 మందిపై అభియోగపత్రం దాఖలు
మావోయిస్టులకు పేలుడు పదార్థాలతోపాటు ఆయుధాల తయారీ సామగ్రిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఎనిమిది మంది నిందితులపై హైదరాబాద్ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) న్యాయస్థానంలో శుక్రవారం అభియోగ పత్రాలు దాఖలయ్యాయి.


తాజా వార్తలు (Latest News)
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!
-
Silk Smitha: సిల్క్ స్మిత బయోపిక్.. హీరోయిన్గా ఎవరంటే..?
-
Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Payyavula Keshav: ఫారం-7 గంపగుత్త అప్లికేషన్లు తీసుకోవడానికి వీల్లేదు: పయ్యావుల
-
KRMB: సాగర్ ఘటన.. ముగిసిన జలశక్తి శాఖ కీలక సమావేశం