పుంగనూరు కేసులో కుమారుడికి బెయిల్ రాలేదని.. తల్లి ఆత్మహత్యాయత్నం
చంద్రబాబు పుంగనూరు పర్యటనలో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో తన కుమారుడికి బెయిల్ రాలేదని, మనస్తాపంతో తల్లి ఆత్మహత్యాయత్నం చేశారు.
సోమల, న్యూస్టుడే: చంద్రబాబు పుంగనూరు పర్యటనలో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో తన కుమారుడికి బెయిల్ రాలేదని, మనస్తాపంతో తల్లి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలంలోని ఇరికిపెంటలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామ మాజీ సర్పంచి శ్రీనివాసులునాయుడు అల్లర్ల కేసులో అరెస్టయి కడప కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో 50 మందికి ఆదివారం బెయిలొచ్చింది. శ్రీనివాసులు నాయుడుకు బెయిల్ రాలేదని ఆయన తల్లి రాజమ్మ గుర్తు తెలియని ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను కుటుంబసభ్యులు 108 వాహనంలో సదుం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు కొట్టారని..పెట్రోల్ పోసుకున్నాడు
సంబంధం లేని గొడవలో తనను తీసుకెళ్లి పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు పోలీస్స్టేషన్లోనే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. -
పింఛను సొమ్ముతో వాలంటీరు పరారీ
పింఛను సొమ్ముతో గ్రామ వాలంటీరు పరారైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. -
అపహరించి.. డబ్బులు డిమాండ్ చేసి
డబ్బుల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసును అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీసులు 2 రోజుల్లో ఛేదించారు.