మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నారా?
‘మా అన్నయ్యకు చెందిన రూ.50 కోట్ల భూమిని కాజేయాలని వైకాపా నాయకులు కుట్ర పన్నుతున్నారు. ఇందులో భాగంగానే ఫోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్లు సృష్టించి కోర్టును తప్పుదారి పట్టించారు.
లేదంటే ఆయన అస్తికలైనా ఇప్పించండి
రూ.50 కోట్ల భూమి కబ్జాకు వైకాపా నేతల కుట్ర
పోలీసులకు ఓ అభాగ్యుడి ఫిర్యాదు
ఈనాడు డిజిటల్, అనంతపురం: ‘మా అన్నయ్యకు చెందిన రూ.50 కోట్ల భూమిని కాజేయాలని వైకాపా నాయకులు కుట్ర పన్నుతున్నారు. ఇందులో భాగంగానే ఫోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్లు సృష్టించి కోర్టును తప్పుదారి పట్టించారు. కొంతకాలంగా మా అన్నయ్య, ఆయన కుటుంబీకులూ కనిపించడం లేదు. వారు ప్రాణాలతో ఉన్నారా? ఉంటే వెతికి పెట్టండి. ప్రాణాలతో లేని పక్షంలో అస్తికలైనా ఇప్పించండి..’ అంటూ ఓ సోదరుడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన విన్నపంపై పోలీసులు కేసు నమోదు చేయకపోగా, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండంటూ వెనక్కి పంపించేశారు. బాధితుడి కథనం మేరకు.. పుట్టపర్తికి చెందిన కరణం గోపాల్రావుకు ఎనిమిది మంది సంతానం. ఆస్తిని కుమారులందరికీ సమానంగా పంచారు. ఇందులో ఓ కుమారుడు రామకృష్ణకు 18.30 ఎకరాలు వచ్చాయి. ఆయన తన కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు.
దీన్ని అదనుగా భావించిన కొంతమంది స్థానిక వైకాపా నాయకులు తన అన్నయ్య భూమిని కాజేయడానికి కుట్ర చేసినట్లు ఆయన సోదరుడు చంద్రశేఖర్రావు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే బోగస్ అగ్రిమెంట్లు సృష్టించి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించారని వివరిస్తున్నారు. ప్రస్తుతం తన అన్నయ్య కుటుంబం కనిపించడం లేదని, వారిని ఏమైనా చేశారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. స్థానిక వైకాపా నాయకులు ఎ.రఘునాథరెడ్డి, జె.రాముతోపాటు పుట్టపర్తికి చెందిన కరణం సుబ్రహ్మణ్యేశ్వరరావు, శేషు, షాకీర్లు కుట్రకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అన్న భూమిలోకి మీరెందుకు వస్తున్నారని ప్రశ్నిస్తే.. ‘మీ అన్న కథ ముగిసింది. నీ అంతు కూడా చూస్తాం. ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడినుంచి వెళ్లిపో.. లేదంటే నీకూ మీ అన్న గతి పడుతుంది..’ అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
వరకట్నం కారణంగా పెళ్లి ఆగిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
Ghaziabad: అతిథులకు ట్రే తగిలిందని ఘాతుకం..వెయిటర్ను చంపి అడవిలో పడేసి..!
వివాహ వేడుకలో అతిథులకు ట్రే తగిలిందని ఓ వెయిటర్ను కొందరు వ్యక్తులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పడేశారు. -
Crime: గ్యాస్ కట్టర్తో ATM దోపిడీకి యత్నం.. కరెన్సీ నోట్లు దగ్ధం!
గ్యాస్ కట్టర్తో ఏటీఎంను పగలగొట్టేందుకు దుండగులు ప్రయత్నించగా.. అందులోని కరెన్సీ నోట్లలో చాలావరకు కాలి బూడిదయ్యాయి. -
పుష్ప ఫేమ్ జగదీశ్ అరెస్ట్
యువతిని బెదిరించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన సినీ నటుడు బండారు ప్రతాప్ అలియాస్ జగదీశ్(31)ను బుధవారం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. -
అత్తమామల చేతిలో శివాని బలి.. చితిలో కాలిన శవంతో ఠాణాకు!
చితిలో కాలిపోతున్న కుమార్తె మృతదేహాన్ని బయటకు తీసిన తల్లిదండ్రులు.. దాన్ని అలాగే తీసుకొని పోలీస్స్టేషనుకు వెళ్లారు. -
13 వేల బాతు పిల్లల మృత్యువాత.. నష్టాన్ని తట్టుకోలేక..
మిగ్జాం తుపాను కారణంగా రూ.15 లక్షల విలువ చేసే బాతు పిల్లలు మృతి చెందగా.. నష్టాన్ని తట్టుకోలేక వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందడం విషాదం నింపింది. -
సుఖ్దేవ్సింగ్ హత్యకేసు నిందితుల్లో సైనికుడు!
రాష్ట్రీయ రాజ్పూత్ కర్ణిసేన చీఫ్ సుఖ్దేవ్సింగ్ గోగామేడీ హత్య రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. జైపుర్లో జరిగిన ఈ హత్యను నిరసిస్తూ కర్ణిసేన బుధవారం రాజస్థాన్ బంద్ నిర్వహించింది. -
భార్యాబిడ్డలను చంపి రైల్వే వైద్యుడి ఆత్మహత్య!
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన ఓ వైద్యుడు తన భార్యాపిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. -
మహదేవ్ యాప్ నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
ఛత్తీస్గఢ్లో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక నిందితుడు అసిమ్దాస్ తండ్రి సుశీల్దాస్(62) అనుమానాస్పద స్థితిలో మరణించారు. -
పోలీసులు కొట్టారని..పెట్రోల్ పోసుకున్నాడు
సంబంధం లేని గొడవలో తనను తీసుకెళ్లి పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు పోలీస్స్టేషన్లోనే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది. -
పింఛను సొమ్ముతో వాలంటీరు పరారీ
పింఛను సొమ్ముతో గ్రామ వాలంటీరు పరారైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. -
అపహరించి.. డబ్బులు డిమాండ్ చేసి
డబ్బుల కోసం ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసును అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పోలీసులు 2 రోజుల్లో ఛేదించారు.


తాజా వార్తలు (Latest News)
-
Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్
-
Sachin - Kohli: ‘సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయడం చాలా కష్టం’
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్- సురేందర్ రెడ్డి కాంబో.. నేపథ్యమిదే!
-
CM Revanth Reddy: తెలంగాణలో విద్యుత్ పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
-
Israel-Hamas: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం.. భారత్ సంతతి సైనికుడి మృతి