గూగుల్ మ్యాప్ను నమ్ముకుంటే నదిలోకి..
భారీగా వర్షం పడుతున్న సమయంలో గూగుల్ మ్యాపులను అనుసరించి డ్రైవింగ్ చేయడంతో కారు నదిలో మునిగి ఇద్దరు యువ వైద్యులు మృతి చెందారు.
కేరళలో ప్రాణాలు పోగొట్టుకొన్న ఇద్దరు యువ వైద్యులు
కోచి: భారీగా వర్షం పడుతున్న సమయంలో గూగుల్ మ్యాపులను అనుసరించి డ్రైవింగ్ చేయడంతో కారు నదిలో మునిగి ఇద్దరు యువ వైద్యులు మృతి చెందారు. కేరళలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. డాక్టర్ అద్వైత్ (29), డాక్టర్ అజ్మల్ (29)లు త్రిశూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని వీరు శనివారం రాత్రి ఇళ్లకు బయల్దేరారు. వీరితోపాటు డాక్టర్ తబ్సిర్, ఎంబీబీఎస్ విద్యార్థిని తమన్నా, నర్స్ జిస్మాన్ కూడా కారులో ఎక్కారు. డ్రైవింగ్ సీట్లో కూర్చొన్న అద్వైత్ గూగుల్ మ్యాపులను అనుసరించి డ్రైవింగ్ చేస్తున్నట్లు అతడి పక్కన కూర్చొన్న తమన్నా చెప్పారు. దానిని అనుసరించిన అతడు మార్గమధ్యలో నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించి.. కారును నేరుగా పెరియార్ నదిలోకి తీసుకెళ్లాడు. స్థానికులు స్పందించి ముగ్గురిని రక్షించారు. అద్వైత్, అజ్మల్ ప్రాణాలు కోల్పోయారు. ‘‘గూగుల్ మ్యాపులు చూపిస్తున్న మార్గాన్ని వారు అనుసరిస్తున్నారు. మ్యాపులో ఎడమవైపునకు వెళ్లమని ఉంది. పొరపాటున నేరుగా వెళ్లారు. నదిలో పడిపోయారు’’ అని పోలీసుల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. వర్షాకాలంలో సాంకేతికతను వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS Polling: ఓటేసేందుకు వచ్చి.. ఇద్దరు వృద్ధులు మృతి
ఆదిలాబాద్ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. -
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు 25 మంది వ్యాపారులను కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని హెచ్చరించి వదిలిపెట్టారు. -
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు. -
యువకుణ్ని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకుమారులు
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లా బహదుర్పుర్ గ్రామంలో దారుణహత్య జరిగింది. ఓ యువకుడిని హతమార్చిన తండ్రీకుమారులు అతడి శరీర భాగాలను 400 ముక్కలుగా చేశారు. -
మత్తులో నెలల బిడ్డను నేలకేసి కొట్టిన తండ్రి
ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ తండ్రి కన్నకూతుర్ని నేలకేసి కొట్టి చంపాడు. వివరాలలోకి వెళితే.. సీతాపుర్కు చెందిన మమత, దర్నాగ్ వాసి సౌరబ్ గౌతంలకు ఏడాది క్రితం ప్రేమపెళ్లి జరిగింది. -
స్వపక్ష నాయకుడిపైనే ఎంపీ కేసు
కృష్ణా జిల్లా గుడివాడ కౌన్సిల్లో వైకాపా పక్ష నేతగా గతంలో వ్యవహరించిన సీహెచ్ రవికాంత్ను తుళ్లూరు పోలీసులు రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ ధ్రువపత్రాలిస్తే క్రిమినల్ చర్యలు
పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని శాఖ సంచాలకుడు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
cybercrime: ఐటీ ఉద్యోగికి సైబర్ మోసగాళ్ల వల.. రూ.3.5 కోట్లకు టోకరా!
cybercrime: ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ.3.5 కోట్లు పోగొట్టుకున్నాడు.


తాజా వార్తలు (Latest News)
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి