పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు వేధింపులకు గురిచేశారు. ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బులంద్శహర్కు చెందిన ఓ యువతి, యువకుడు త్వరలో వివాహం చేసుకోనున్నారు.
లఖ్నవూ: త్వరలో వివాహం చేసుకోబోతున్న ఓ జంటను కొందరు పోలీసులు వేధింపులకు గురిచేశారు. ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బులంద్శహర్కు చెందిన ఓ యువతి, యువకుడు త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే సరదాగా గడిపేందుకు స్థానిక పార్క్కు వెళ్లారు. ఆ సమయంలో ముగ్గురు పోలీసులు వారిని రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే జైలుకే అంటూ యువకుడిని బెదిరించారు. తమని వదిలేయమంటూ పోలీసుల కాళ్లు పట్టుకొని ఆ జంట వేడుకున్నా కనికరించలేదు. యువకుడి నుంచి కొంత డబ్బును బలవంతంగా బదిలీ చేయించుకున్నారు. అవి సరిపోవంటూ రూ.5 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారు. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. తరచూ యువతికి ఫోన్ చేసి వేధింపులకు పాల్పడడమే కాకుండా యువతిని కలిసేందుకు ఆమె ఇంటికి కూడా వచ్చేవారు. దీంతో ఆ జంట.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నిందితులను రాకేశ్ కుమార్, దిగంబర్ కుమార్గా గుర్తించారు. మూడో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
ఓ దస్తావేజు లేఖరిని ఇద్దరు దుండగులు ఇంటికి వచ్చి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. -
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య
ఒక పక్క ప్రైవేట్ ఆర్థిక సంస్థ ఒత్తిళ్లు.. మరో పక్క ఇష్టపడిన యువతి నుంచి స్పందన తక్కువగా ఉండటం.. వీటితో మానసిక ఒత్తిడి గురైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లారీ దహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టులు ఓ లారీని దహనం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి మండలంలోని పూసుగుప్పలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. -
కోటాలో నీట్ అభ్యర్థి ఆత్మహత్య
రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంగళవారం మరో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
గ్లాస్ డోర్ మీదపడి చిన్నారి మృతి
పంజాబ్లోని లుధియానా షోరూంలో గ్లాస్ డోర్తో ఆడుకొంటున్న మూడేళ్ల చిన్నారికి ఆ తలుపే మృత్యువుగా మారింది. నగరంలోని ఘుమార్ మండీ వస్త్రదుకాణంలో ఈ దుర్ఘటన జరిగింది. -
యూపీలో అపహరణ.. హైదరాబాద్లో అత్యాచారం
ఉత్తర్ప్రదేశ్కు చెందిన 13 ఏళ్ల బాలికను అపహరించిన ఓ వ్యక్తి హైదరాబాద్లో ఆమెపై వారం రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. -
విశ్రాంత ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.25 కోట్లు మాయం
ఓ విశ్రాంత ఉద్యోగి బ్యాంక్ ఖాతా నుంచి రూ.4.25 కోట్లు మాయమవ్వడంతో కోరుట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
కాల్పులకు తెగబడిన దుండగులను చీపురు కర్రతోనే తరిమికొట్టిందో మహిళ. హరియాణాలో ఈ ఘటన ఇది వెలుగుచూసింది.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ
-
December deadline: ఆధార్ అప్డేట్.. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్.. డిసెంబర్ డెడ్లైన్స్ ఇవే!
-
Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,000 చేరువలో నిఫ్టీ
-
Top Ten News @ Election Special: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
-
CM Jagan: పిల్లల కళ్లజోళ్ల మీదా ఆయన బొమ్మే