దళిత యువకుడిపై పోలీసుల దాష్టీకం
విచారణ పేరుతో 24ఏళ్ల దళిత యువకుడిని మద్యం మత్తులో ఇద్దరు క్రైం పోలీసులు విచక్షణరహితంగా చితకబాదారు. లాఠీలతో ప్రతాపం చూపించి యువకుడి కాలు విరగ్గొట్టారు. ఈ ఘటన విశాఖ జిల్లా పద్మనాభం స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
కోళ్ల దొంగతనం కేసులో విచారణ పేరిట కాలు విరగ్గొట్టిన వైనం!
ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
విశాఖ జిల్లా పద్మనాభం స్టేషన్ పరిధిలో ఘటన
ఈనాడు-విశాఖపట్నం, పద్మనాభం-న్యూస్టుడే: విచారణ పేరుతో 24ఏళ్ల దళిత యువకుడిని మద్యం మత్తులో ఇద్దరు క్రైం పోలీసులు విచక్షణరహితంగా చితకబాదారు. లాఠీలతో ప్రతాపం చూపించి యువకుడి కాలు విరగ్గొట్టారు. ఈ ఘటన విశాఖ జిల్లా పద్మనాభం స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాందేవుపురం గ్రామానికి చెందిన ఇందుకూరు రాజాబాబు తన షెడ్డులోని కోళ్లు చోరీకి గురయ్యాయంటూ సెప్టెంబరు 29వ తేదీన పద్మనాభం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అదే గ్రామానికి చెందిన బాందేవపురం పాపు, గాలి ఎర్నిబాబులను అనుమానించి పోలీసులు స్టేషన్కు పిలిపించారు. ఆదివారం ఉదయం విచారణ తర్వాత కేసును అదే స్టేషన్ పరిధిలోని క్రైం విభాగ పోలీసులకు అప్పగించారు.
తంతే మీరే ఇస్తారంటూ....
పోలీసులు ఆదివారం రాత్రి వారిని అక్కడే ఉంచారు. ఈ సమయంలో కానిస్టేబుళ్లు కె.శ్రీను, కె.సతీష్ వారిని విచారించారు. తప్పు ఒప్పుకొన్నామని, రాజాబాబుతో రాజీ అయ్యామని పాపు, ఎర్నిబాబు పోలీసులకు చెప్పారు. అయితే చెరో రూ.5వేలు చొప్పున తమకు ఇవ్వాలంటూ కానిస్టేబుళ్లు డిమాండ్ చేసినట్లు ఘటన అనంతరం బాధితులు పేర్కొన్నారు. అంత మేం ఇచ్చుకోలేమని చెప్పగా, తంతే మీరే ఇస్తారంటూ మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని చితకబాదారు. గతంలో జరిగిన ఆటో ప్రమాదంలో పాపు కుడి కాలు విరగ్గా శస్త్రచికిత్స జరిగింది. అదే కాలుపై కానిస్టేబుళ్లు కొట్టారు. తట్టుకోలేక పాపు, ఎర్నిబాబు పెద్దగా కేకలు వేయడంతో స్టేషన్ బయటఉన్న కుటుంబ సభ్యులు లోపలికి పరుగెత్తుకొచ్చారు. వారిని చూసి కానిస్టేబుళ్లు శ్రీను, సతీష్ గోడదూకి పారిపోయారు. అనంతరం కాలు విరిగిన పాపుని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు అర్ధరాత్రి స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. క్రైం డీసీపీ నాగన్న స్టేషన్కు వచ్చి దర్యాప్తు చేశారు. పాపు ఫిర్యాదు మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పద్మనాభం ఎస్సై మల్లేశ్వరరావు, కానిస్టేబుళ్లు శ్రీను, సతీష్లను సస్పెండ్ చేస్తూ సీపీ రవిశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్ సీఐ సన్యాసినాయుడికి ఛార్జి మెమో ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువకుణ్ని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకుమారులు
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లా బహదుర్పుర్ గ్రామంలో దారుణహత్య జరిగింది. ఓ యువకుడిని హతమార్చిన తండ్రీకుమారులు అతడి శరీర భాగాలను 400 ముక్కలుగా చేశారు. -
25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు 25 మంది వ్యాపారులను కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని హెచ్చరించి వదిలిపెట్టారు. -
మత్తులో నెలల బిడ్డను నేలకేసి కొట్టిన తండ్రి
ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ తండ్రి కన్నకూతుర్ని నేలకేసి కొట్టి చంపాడు. వివరాలలోకి వెళితే.. సీతాపుర్కు చెందిన మమత, దర్నాగ్ వాసి సౌరబ్ గౌతంలకు ఏడాది క్రితం ప్రేమపెళ్లి జరిగింది. -
స్వపక్ష నాయకుడిపైనే ఎంపీ కేసు
కృష్ణా జిల్లా గుడివాడ కౌన్సిల్లో వైకాపా పక్ష నేతగా గతంలో వ్యవహరించిన సీహెచ్ రవికాంత్ను తుళ్లూరు పోలీసులు రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ ధ్రువపత్రాలిస్తే క్రిమినల్ చర్యలు
పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని శాఖ సంచాలకుడు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
cybercrime: ఐటీ ఉద్యోగికి సైబర్ మోసగాళ్ల వల.. రూ.3.5 కోట్లకు టోకరా!
cybercrime: ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ.3.5 కోట్లు పోగొట్టుకున్నాడు.