యువకుడి దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ మృతి
వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా డీజే ఆపమన్నందుకు గత నెల 30న ఉలాస రామకృష్ణ అనే యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ గంధం నరేంద్ర(34).. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందారు.
ఆగిరిపల్లి, నూజివీడు రూరల్, పట్టణం, న్యూస్టుడే: వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా డీజే ఆపమన్నందుకు గత నెల 30న ఉలాస రామకృష్ణ అనే యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ గంధం నరేంద్ర(34).. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందారు. మృతదేహాన్ని సోమవారం ఆయన స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడుకు తరలించారు. నరేంద్ర ఎంబీఏ చేసి, 2018లో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. తొలుత ఏలూరు జిల్లా చాట్రాయి పోలీస్స్టేషన్లో పనిచేశారు. మూడు నెలల కిందట బదిలీపై ఆగిరిపల్లి స్టేషన్కు వచ్చారు. ఆగిరిపల్లి మండలం ఈదరకు చెందిన లక్ష్మీప్రియను 2019లో వివాహం చేసుకున్నారు. వారికి రెండేళ్ల కుమారుడు, ఎనిమిది నెలల కుమార్తె ఉన్నారు. నరేంద్ర కుటుంబాన్ని ప్రభుత్వం, పోలీసు శాఖ ఆదుకుంటుందని ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. నరేంద్ర మృతదేహాన్ని సందర్శించి వారు నివాళులర్పించారు. నరేంద్ర పిల్లల చదువుల బాధ్యతను పోలీసు శాఖ తీసుకుంటుందని ఈ సందర్భంగా డీఐజీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS Polling: ఓటేసేందుకు వచ్చి.. ఇద్దరు వృద్ధులు మృతి
ఆదిలాబాద్ పట్టణంలో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. -
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు 25 మంది వ్యాపారులను కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని హెచ్చరించి వదిలిపెట్టారు. -
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు. -
యువకుణ్ని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకుమారులు
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లా బహదుర్పుర్ గ్రామంలో దారుణహత్య జరిగింది. ఓ యువకుడిని హతమార్చిన తండ్రీకుమారులు అతడి శరీర భాగాలను 400 ముక్కలుగా చేశారు. -
మత్తులో నెలల బిడ్డను నేలకేసి కొట్టిన తండ్రి
ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూలో మత్తు పదార్థాలకు బానిసైన ఓ తండ్రి కన్నకూతుర్ని నేలకేసి కొట్టి చంపాడు. వివరాలలోకి వెళితే.. సీతాపుర్కు చెందిన మమత, దర్నాగ్ వాసి సౌరబ్ గౌతంలకు ఏడాది క్రితం ప్రేమపెళ్లి జరిగింది. -
స్వపక్ష నాయకుడిపైనే ఎంపీ కేసు
కృష్ణా జిల్లా గుడివాడ కౌన్సిల్లో వైకాపా పక్ష నేతగా గతంలో వ్యవహరించిన సీహెచ్ రవికాంత్ను తుళ్లూరు పోలీసులు రెండు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ ధ్రువపత్రాలిస్తే క్రిమినల్ చర్యలు
పశుసంవర్ధక సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నకిలీ ధ్రువపత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని శాఖ సంచాలకుడు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
cybercrime: ఐటీ ఉద్యోగికి సైబర్ మోసగాళ్ల వల.. రూ.3.5 కోట్లకు టోకరా!
cybercrime: ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ.3.5 కోట్లు పోగొట్టుకున్నాడు.


తాజా వార్తలు (Latest News)
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా