మానవత్వమా.. నువ్వెక్కడ?
ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. వాహన సిబ్బంది కనికరం లేకుండా మార్గమధ్యలో కిందికి దించేయడంతో కొద్దిసేపటికి ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు
మార్గమధ్యలో సిబ్బంది దించేసి వెళ్లడంతో మృతి
చెన్నై(ప్యారిస్), న్యూస్టుడే: ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి గుండెపోటు రాగా.. వాహన సిబ్బంది కనికరం లేకుండా మార్గమధ్యలో కిందికి దించేయడంతో కొద్దిసేపటికి ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్కి చెందిన జ్యోతిభాస్కర్ (50).. శంకరన్కోవిల్లోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. హోటల్కు వెళ్లేందుకు సోమవారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. రాజపాళెయం వద్ద జ్యోతిభాస్కర్కు గుండెనొప్పి రావడంతో తోటి ప్రయాణికులు కండక్టర్, డ్రైవర్కు చెప్పారు. కానీ వారు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా శంకరన్కోవిల్ సమీపంలో కిందికి దించి అక్కడున్న టీ దుకాణం ముందు కూర్చోబెట్టి మానవత్వం లేకుండా వెళ్లిపోయారు. ఉదయాన్నే దుకాణం తెరవడానికి వచ్చిన వ్యక్తి పడిపోయి ఉన్న జ్యోతిభాస్కర్ను చూసి పైకి లేపడానికి యత్నించాడు. చలనం లేకపోవడంతో అంబులెన్స్ ద్వారా రాజపాళెయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం
హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న శ్రీకృష్ణా ట్రావెల్స్ బస్సు ఆదివారం అర్ధరాత్రి దాటాక జిల్లా కేంద్రం నల్గొండ సమీపంలో నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై మర్రిగూడ బైపాస్ సమీపంలో కాలిపోయింది. -
కుప్పకూలిన శిక్షణ విమానం
మెదక్ జిల్లా తూప్రాన్లోని రావెళ్లి శివారులో సోమవారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీకి చెందిన ‘పైలట్ పీసీ 7 ఎంకె 2’ శిక్షణ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలడంతో.. అందులోని పైలట్, శిక్షణ పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందారు. -
లోయలో పడిన వాహనం.. ఆరుగురి దుర్మరణం
ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందిన దుర్ఘటన శిమ్లా జిల్లాలోని సున్నీ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. -
యువతిని హత్య చేసి.. కాల్చివేసి
గుర్తుతెలియని యువతిని హత్యచేసి కాల్చివేసిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం సమీపంలో ప్రధాన రహదారి పక్కన సోమవారం వెలుగుచూసింది. స్థానిక ఎస్సై హరీశ్ వివరాల ప్రకారం..