తండ్రి కళ్లెదుటే ఘోరం

తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్ల ముందే ఇద్దరు కుమారులు ప్రాణాలు విడిచారు. విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన బర్రే వేణు, ఆయన భార్య లోవలక్ష్మి పాయకరావుపేట మండలం

Updated : 21 Dec 2020 06:43 IST

కంటైనర్‌ ఢీకొని ఇద్దరు కుమారుల మృతి

తుని పట్టణం, న్యూస్‌టుడే: తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్ల ముందే ఇద్దరు కుమారులు ప్రాణాలు విడిచారు. విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన బర్రే వేణు, ఆయన భార్య లోవలక్ష్మి పాయకరావుపేట మండలం పాల్తేరులోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. వారి కుమారులు దుర్గాప్రసాద్‌(17), తాతాజీ(7) స్వగ్రామమైన కోటవురట్లలోనే చదువుకుంటున్నారు. కుమారులను తీసుకురావడానికి వేణు శనివారం తన సొంతూరికి వెళ్లారు. ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై తండ్రీకొడుకులు పాల్తేరుకు బయలుదేరారు. తుని పట్టణానికి చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన ఓ కంటైనర్‌ వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో దాని చక్రాల కిందపడి ఇద్దరు కుమారులు తండ్రి కళ్లెదుటే మృతి చెందారు. తండ్రి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కొద్ది రోజులు పిల్లలను తమ వద్ద ఉంచుకుందామంటే.. తిరిగిరాని లోకాలకు వెళ్లారని తల్లి లోవలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని