Tamilnadu: ఆలయంలో వృద్ధుడి ఆత్మాహుతి
డీఎంకే అధికారంలోకి వస్తే ప్రాణాలు అర్పిస్తానని మొక్కుకున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని కరూర్ జిల్లా లాలాపేటకు చెందిన ఉలగనాథన్ (60) రవాణా శాఖ విశ్రాంత ఉద్యోగి. శుక్రవారం మణమంగలం...
డీఎంకే అధికారంలోకి వస్తే ప్రాణాలర్పిస్తానని మొక్కు
ఆర్కేనగర్, న్యూస్టుడే: డీఎంకే అధికారంలోకి వస్తే ప్రాణాలు అర్పిస్తానని మొక్కుకున్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని కరూర్ జిల్లా లాలాపేటకు చెందిన ఉలగనాథన్ (60) రవాణా శాఖ విశ్రాంత ఉద్యోగి. శుక్రవారం మణమంగలం పుదు కాళియమ్మన్ ఆలయంలోకి వెళ్లాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆలయ సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. వాంగల్ పోలీసులు అతడు రాసిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘శాసనసభ ఎన్నికల్లో డీఎంకే గెలిచి స్టాలిన్ సీఎం కావాలని, ఎమ్మెల్యేగా సెంథిల్బాలాజీ విజయం సాధించాలని మొక్కుకున్నాను. విళుపురం జిల్లా గ్రామ నిర్వాహక అధికారిగా పనిచేస్తున్న నా కుమారుడిని మంత్రి సెంథిల్బాలాజీ పరిధిలో నియమించాలి. అదే నా చివరి ఆశ’ అని ఆ లేఖలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నారాయణమూర్తి మనవడి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ