AP News: చెల్లిని వంచించి.. అక్కతో రహస్య వివాహం
బాలికను బెదిరించి అత్యాచారం చేసి నగ్నవీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి బంగారు వస్తువులు, రూ.లక్షలు వసూలు చేశాడు. ఆమె సోదరితో ప్రేమాయణం నడిపి రహస్యంగా వివాహం చేసుకున్న యువకుడిని గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు అరెస్టుచేశారు.
బాలిక నగ్న వీడియోలు చిత్రీకరించి బెదిరింపులు
ఇంజినీరింగ్ యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు
గుంటూరు, న్యూస్టుడే: బాలికను బెదిరించి అత్యాచారం చేసి నగ్నవీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి బంగారు వస్తువులు, రూ.లక్షలు వసూలు చేశాడు. ఆమె సోదరితో ప్రేమాయణం నడిపి రహస్యంగా వివాహం చేసుకున్న యువకుడిని గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు అరెస్టుచేశారు. గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్పీ ప్రశాంతి ఆదివారం ఈ కేసు వివరాలను విలేకరులకు తెలిపారు. చేబ్రోలుకు చెందిన వేములపల్లి జోషిబాబు ఇంజినీరింగ్ చదివి పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. చిలకలూరిపేటకు చెందిన బాలిక 2019లో వేసవి సెలవులకు చేబ్రోలులోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో జోషిబాబు ఆమె వెంటపడ్డాడు. ఫోన్ నంబరు ఇవ్వకపోతే యాసిడ్ పోస్తానని, అమ్మమ్మను చంపేస్తానని బెదిరించాడు. తరవాత అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో కాల్ చేసి ఆమెతో నగ్నంగా మాట్లాడించాడు. డబ్బులు ఇవ్వకపోతే నగ్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించి బంగారు గొలుసు తీసుకున్నాడు. ఆమె నాన్నకు ఫోన్ చేసి బాలిక నగ్నవీడియోలు, ఫొటోలు వేరేవారి దగ్గర చూశానని, వాటిని తొలగించాలంటే ఖర్చవుతుందంటూ రూ.3.30 లక్షలు తీసుకున్నాడు. వాటిని డిలీట్ చేయిస్తానంటూ ఆమె సోదరి నుంచి బంగారుగొలుసు కాజేశాడు. తర్వాత ఆమెకు మాయమాటలు చెప్పి ప్రేమాయణం నడిపాడు. ఈ నెల 13న రహస్యంగా తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ మధుసూదనరావు, ఎస్సై కోటేశ్వరరావు శనివారం రాత్రి నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. అతని వద్ద రెండు బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ