Acid: అదనపు కట్నం తేనందని.. భార్యతో యాసిడ్‌ తాగించిన భర్త!

అదనపు కట్నం తెచ్చేందుకు నిరాకరించిందని.. భార్యతో బలవంతంగా యాసిడ్‌ తాగించాడు అమె భర్త. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ దారుణం జరిగింది. బాధితురాలు ప్రస్తుతం దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్వాలియర్‌లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్‌కు ఈ ఏడాది 17న శశితో వివాహమైంది.

Updated : 17 Aug 2022 15:51 IST

మధ్యప్రదేశ్‌: అదనపు కట్నం తెచ్చేందుకు నిరాకరించిందని.. భార్యతో బలవంతంగా యాసిడ్‌ తాగించాడు అమె భర్త. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ దారుణం జరిగింది. బాధితురాలు ప్రస్తుతం దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్వాలియర్‌లోని దబ్రాకు చెందిన వీరేంద్ర కుమార్‌కు ఈ ఏడాది 17న శశితో వివాహమైంది. వధువు తల్లిదండ్రులు రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా జరిపించారు. ఇటీవల కాలంలో వీరేంద్ర కారు కొనేందుకు.. రూ.3 లక్షల అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. ఆమె నిరాకరించడంతో మాటామాటా పెరిగింది. దీంతో భార్యను కిందకు నెట్టి బలవంతంగా యాసిడ్‌ తాగించాడు. ఆమె శరీరంలో పలు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మెరుగైన వైద్యం కోసం దిల్లీ ఆస్పత్రికి తరలించినట్టు స్థానిక వైద్యులు చెప్పారు. భర్తని పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని