Hyderabad News: పక్కా ప్రణాళికతోనే స్థిరాస్తి వ్యాపారి హత్య

స్థిరాస్తి వ్యాపారి గడ్డం విజయభాస్కర్‌రెడ్డిని పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని ఆయన అల్లుడు జయసృజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో నెల్లూరుకు చెందిన విజయభాస్కర్‌రెడ్డి(63)ని హతమార్చి ఏపీలోని సున్నిపెంటలో మృతదేహాన్ని దహనం చేసిన విషయం తెలిసిందే.

Updated : 08 Aug 2021 07:04 IST

విజయభాస్కర్‌రెడ్డి అల్లుడు జయసృజన్‌రెడ్డి

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: స్థిరాస్తి వ్యాపారి గడ్డం విజయభాస్కర్‌రెడ్డిని పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని ఆయన అల్లుడు జయసృజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో నెల్లూరుకు చెందిన విజయభాస్కర్‌రెడ్డి(63)ని హతమార్చి ఏపీలోని సున్నిపెంటలో మృతదేహాన్ని దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై శనివారం జయసృజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. గురూజీని విమర్శిస్తే చంపుతామని మల్లేశ్‌, సుధాకర్‌ అనే వ్యక్తులు గత నెల మొదట్లో తన మామను హెచ్చరించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు చెప్పారు. కాగా మల్లేశ్‌, సుధాకర్‌, కృష్ణంరాజు, ఆర్‌ఎంపీ వైద్యుడు శ్రవణ్‌ను అరెస్టు చేసినట్లు కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని