Kidnap: సినీ ఫక్కీలో టెకీ అపహరణ.. మిత్రులే నిందితులు
నగదు కోసం వినీత్ అనే టెకీని అపహరించి రూ.2 కోట్లు డిమాండు చేసిన అతని మిత్రులైన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ప్రశాంత్, సంతోశ్, అరివేగన్లను బెంగళూరు కోరమంగల పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
బెంగళూరు, న్యూస్టుడే: నగదు కోసం వినీత్ అనే టెకీని అపహరించి రూ.2 కోట్లు డిమాండు చేసిన అతని మిత్రులైన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ప్రశాంత్, సంతోశ్, అరివేగన్లను బెంగళూరు కోరమంగల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సంతోశ్, వినీత్ ఒకే చోట పని చేసేవారు. ఇటీవలే వినీత్ కొత్తగా అంకుర పరిశ్రమ ప్రారంభించి మరో సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తనకు ఇవ్వవలసిన పాత బకాయి చెల్లించడానికి వినీత్ నిరాకరించడంతో తన స్నేహితులతో కలిసి అపహరణకు సంతోశ్ పథకాన్ని రచించాడు. పార్టీకి రమ్మని వినీత్ను ఆహ్వానించిన నిందితులు గత మంగళవారం కారులో చెన్నై సమీపంలోని ఓ ఇంట్లో బంధించారు. అతని కుటుంబ సభ్యులకు బుధవారం రాత్రి వాట్సప్ కాల్ చేసి నగదు డిమాండు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు, కాల్డేటా ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్