Disha Case: రవి గెస్ట్హౌస్లో ఏం జరిగింది..?
‘దిశ’ హత్యాచార ఘటన నిందితుల ఎన్కౌంటర్కు ముందు రవి గెస్ట్హౌస్లో ఏం జరిగిందనే అంశంపై జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ బుధవారం విచారణ జరిపింది.
చటాన్పల్లి ఎన్కౌంటర్ నేపథ్యంపై కమిషన్ విచారణ
ఈనాడు, హైదరాబాద్: ‘దిశ’ హత్యాచార ఘటన నిందితుల ఎన్కౌంటర్కు ముందు రవి గెస్ట్హౌస్లో ఏం జరిగిందనే అంశంపై జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ బుధవారం విచారణ జరిపింది. రంగారెడ్డి జిల్లా చటాన్పల్లిలో ‘దిశ’ మృతదేహాన్ని కాల్చేసిన ప్రాంతానికి నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్కు తీసుకెళ్లే ముందు నార్సింగి-శంకర్పల్లి మార్గంలోని రవి గెస్ట్హౌస్లోనే ఉంచిన నేపథ్యంలో గెస్ట్హౌస్ నిర్వాహకుల్ని కమిషన్ విచారించింది. కమిషన్ తరఫు న్యాయవాది విరూపాక్షగౌడ.. గెస్ట్హౌస్ మేనేజర్ అనిల్కుమార్, కాపలాదారు వెంకటేశ్వర్లును పలు ప్రశ్నలు అడిగారు. షాద్నగర్ అప్పటి ఏసీపీ సురేందర్ గెస్ట్హౌస్ కావాలని అడిగారని నిర్వాహకులు తెలిపారు. 2019 డిసెంబరు 3-6వ తేదీ వరకు లీజుకు తీసుకొని రోజుకు రూ.వెయ్యి చొప్పున ఇచ్చారని వెల్లడించారు. అనంతరం నిందితులను చర్లపల్లి జైలు నుంచి పోలీస్ కస్టడీకి తీసుకుని గెస్ట్హౌస్కు తీసుకెళ్లేందుకు వినియోగించిన వాహనం డ్రైవర్(హోంగార్డు) యాదగిరినీ న్యాయవాది విచారించారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ నుంచి 5వ తేదీ రాత్రి 11.30 గంటలకు బయలుదేరి రవి గెస్ట్హౌస్కు 12.15 గంటలకు చేరుకున్నానని యాదగిరి తెలిపారు. అక్కడ ఏసీపీ సురేందర్ను కలిశానని చెప్పారు. తెల్లవారుజామున చటాన్పల్లికి వెళ్లాల్సి ఉన్నందున విశ్రాంతి తీసుకోవాలని సూచించారని పేర్కొన్నారు. తెల్లవారుజామున పోలీస్ సిబ్బందితోపాటు నిందితులనూ తన వాహనంలోనే తీసుకెళ్లానని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్